Viral Video : ట్రక్కుమీదికి వచ్చినా..తప్పించుకున్న వ్యక్తి…వైరల్ వీడియోపై స్పందించిన కేటీఆర్..!!
సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియోపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుట్ పాత్ పై నిలబడి ఉన్న వ్యక్తి ఓ పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు
- By hashtagu Published Date - 12:21 PM, Mon - 11 July 22
సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియోపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుట్ పాత్ పై నిలబడి ఉన్న వ్యక్తి ఓ పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ వీడియోకు మంత్రి రీట్వీట్ చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. ఓ ట్రక్ మీదికి దూసుకొచ్చినా అద్రుష్టం కొద్దీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను IPSఅధికారి దీపాంశుకబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో ఇఫ్పటికి 4మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
అసలు ఈ వీడియోలో ఏముందంటే…ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉన్నాడు. అయిదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి పక్కన చెట్టుకొమ్మలకు ఈ ట్రక్ వేగంగా తగులుతుంది. దీంతో అది బ్యాలెన్స్ తప్పి ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. అయితే అద్రుష్టం కొద్ది అతడు ట్రక్కు గేటుకు మధ్య ఇరుక్కుపోయాడు. ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా కూడా క్షణాల్లోనే జరిగింది. ఈ వీడియోను షేర్ చేస్తూ జీవితం చాలా అనూహ్యమైంది అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. కొందరు ఆ వ్యక్తిని అదృష్టవంతుడిగా పేర్కొన్నారు. మరో యూజర్ ఓహ్ ఆయన జీవిత కథను చెప్పడానికి సేఫ్ గా ఉన్నాడు అని రాశాడు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రీట్వీట్ చేస్తూ ఓ డార్న్ అతడు ఎలా బతికాడు…అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు.
Oh Darn!!!! How did he survive that??😱 https://t.co/M6MBGrlPKG
— KTR (@KTRTRS) July 9, 2022
Tags
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �