Only In India: మెరుపుల బండి..పాటలు దండి.. ఆనంద్ మహీంద్రా షేర్ చేశారండి!
అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి.
- By Hashtag U Published Date - 02:30 PM, Sun - 19 June 22
అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి. ఈ మెరుపుల బండి వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. జూన్ 17న దీన్ని షేర్ చేయగా.. కేవలం 2 రోజుల్లోనే 3 లక్షల వ్యూస్, 18 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
ఈ వీడియో తో పాటు ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. “జీవితం మీరు కోరుకున్నంత రంగులమయంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఓన్లీ ఇన్ ఇండియా” అని పేర్కొన్నారు. మన ఇండియాలోని ఓ పెట్రోల్ బంకులో ఈ వీడియోను తీశారు. ఆ స్కూటర్ ను ఫోటోలు తీయడానికి, సెల్ఫీలు దిగదానికి ఎంతోమంది ఎగబడుతుండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. క్రియేటివితో ఈ స్కూటర్ ను కలర్ ఫుల్ గా మార్చుకున్న వ్యక్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022
Related News
Anand Mahindra: అలెక్సా ద్వారా కోతుల్ని తరిమిన అమ్మాయికి ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్
ఉత్తరప్రదేశ్లో సాంకేతిక పరిజ్ఞానంతో 13 ఏళ్ళ బాలిక తన చెల్లిని కోతుల దాడి నుంచి కాపాడింది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత మరో 15నెలల తన చెల్లిని చాకచక్యంగా కాపాడింది. అలెక్సా ద్వారా కోతుల బెడద నుంచి సోదారిని కాపాడిన ఈ 13 ఏళ్ళ నికిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.