Free Maternity Care : ఆ ఆస్పత్రిలో ఫ్రీ డెలివరీ.. రామమందిర ప్రారంభోత్సవ వేళ సేవాభావం
Free Maternity Care : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరగనుంది.
- By Pasha Published Date - 01:15 PM, Fri - 19 January 24
Free Maternity Care : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరగనుంది. దీన్ని పురస్కరించుకొని కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉన్న జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎష్ఎస్) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జనవరి 18 నుంచి 22 వరకు గర్భిణులకు ఉచితంగా ప్రసవాలు చేయనున్నారు. ఈ ఆస్పత్రిని శ్రీ సిద్దేశ్వర లోక కళ్యాణ్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. రామ మందిర నిర్మాణం అనేది గొప్ప సందర్భమని, ఈ తరుణంలో ప్రజలకు తమవంతుగా సహాయం చేయాలని కోరుకుంటున్నామని ఆస్పత్రి అధికారి వెల్లడించారు. కాబట్టి ఈ నిర్దిష్ట వ్యవధిలో జరిగే అన్ని డెలివరీలు ఉచితంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జేఎస్ఎస్ ఆస్పత్రి నిర్ణయంపై పలువురు రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
విజయపుర రీజియన్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు జేఎస్ఎస్ ఆస్పత్రిలో ఉచిత డెలివరీలు చేయడం చాలా మంచి విషయమన్నారు. జనవరి 22న జేఎస్ఎస్ ఆస్పత్రిలో(Free Maternity Care) జన్మించిన మగ బిడ్డ శ్రీరాముడి రూపమని, ఆడ పిల్ల సీతా దేవి రూపమని వ్యాఖ్యానించారు.
Also Read: SC Sub Quota : Govt of India: ఎస్సీ వర్గీకరణపై ఐదుగురితో కేంద్ర కమిటీ
బంగారు తలుపులు
అయోధ్య ఆలయంలో 42 బంగారు తలుపులను ఏర్పాటు చేశారు. ఈ తలుపులకు 100 కిలోల బంగారంతో పసిడి పూత పూశారు. భక్తులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఈ తలుపులను డిజైన్ చేశారు. అయోధ్యలోని రామాలయానికి మొత్తం 46 ద్వారాలుంటాయి. రామాలయంలోని గుడిమెట్ల దగ్గర ఉండే నాలుగు ద్వారాలు మినహాయించి మిగిలిన వాటికి అన్నింటికి బంగారు పూత పూశారు.
హైదరాబాద్ ముత్యాల హారం
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకు పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఇక అయోధ్య రాముడికి ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ వారు హైదరాబాద్ నుంచి మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు హారాన్ని పంపిస్తున్నారు. తొమ్మిది మంది కళాకారులతో తొమ్మిది రోజుల్లో దీన్ని తయారు చేయించారు. ముంబై నుంచి తెప్పించిన ముత్యాలతో వీటిని తయారీ చేశారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో ఈ హారాన్ని ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ తయారు చేయించింది.
కారుపై అయోధ్య రామమందిర నమూనా
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. కారుపై అయోధ్య రామమందిర నిర్మాణ నమూనాను రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్లో ఉంది. హైదరాబాద్కు చెందిన సుధా కార్ మ్యూజియం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శనకు ఉంచనున్నట్లు సుధా కార్ మ్యూజియం యాజమాని సుధాకర్ యాదవ్ తెలిపారు.
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.