SC Sub Quota : Govt of India: ఎస్సీ వర్గీకరణపై ఐదుగురితో కేంద్ర కమిటీ
SC Sub Quota : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2023 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
- By Pasha Published Date - 12:35 PM, Fri - 19 January 24
SC Sub Quota : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2023 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 22న జరగనుంది. దీనిపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇటీవల స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయంలో మాదిగ దండోరా ఆధ్వర్యంలో 30 ఏండ్లుగా ఆందోళనలు కొనసాగుతుండగా, మొదటినుంచీ బీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని మాజీ సీఎం కేసీఆర్, తాను కలిసి వెళ్లి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మార్పీఎస్ కొన్నేళ్లుగా ఉద్యమం చేపట్టి నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.
Also Read: Underwater Nuclear Drone : సముద్ర గర్భ అణ్వాయుధ డ్రోన్ పరీక్ష.. కిమ్ దూకుడు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2024న మధ్యంతర బడ్జెట్ను సమర్పించనున్నారు . ఇది మోడీ ప్రభుత్వ రెండో హయాంలో మధ్యంతర బడ్జెట్. లోక్సభ ఎన్నికలకు ముందు ఇది మధ్యంతర బడ్జెట్. అందుకే, లోక్సభలో బలమైన పునరాగమనం కోసం మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగబోతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మోడీ హయాంలో బడ్జెట్ 2.0 ప్రతి తరగతి నుండి అధిక అంచనాలను కలిగి ఉంది. రైతులు, యువత, మహిళలకు ఈ బడ్జెట్ ప్రత్యేకం.
మహిళలకు ప్రత్యేకంగా ఏమి ఉంటుంది?
లోక్సభ ఎన్నికల్లో మహిళల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాడ్లీ బహనా పథకాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ స్కీమ్కు సంబంధించిన అర్హత, ప్రమాణాలు, వార్షిక ఆదాయం, దాని ప్రయోజనాలపై చర్చ ప్రారంభమైంది. ఈ పథకం దేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పథకం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. లాడ్లీ బహనా పథకం ఆ రాష్ట్రంలో బీజేపీకి భారీ ఆధిక్యాన్ని ఇచ్చింది.
Related News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.