Teacher Video: తక్కువ మార్కులు వేశారంటూ.. ఉపాధ్యాయుడ్ని కొట్టిన విద్యార్థులు
విద్యాబుద్దులు చెప్పే గురువును దండించారు విద్యార్థులు.
- By Balu J Published Date - 04:21 PM, Thu - 1 September 22
విద్యాబుద్దులు చెప్పే గురువును దండించారు విద్యార్థులు. తమకు తక్కువ మార్కులు వేశారని ఆగ్రహిస్తూ.. చెట్టుకు కట్టేసి చితకాబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తొమ్మిదో తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినందుకు రెసిడెన్షియల్ పాఠశాలలో లెక్కల టీచర్ ను విద్యార్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. జార్ఖండ్ లోని గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంలో విద్యార్థులపై మండిపడుతున్నారు పలువురు.
జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (JAC) శనివారం విడుదల చేసిన IX తరగతి పరీక్షలో 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-DD (ఫెయిల్) మార్కులు పొందారు. “పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వనందున ఎలాంటి పోలీస్ ఫిర్యాదు అందలేదు. ఘటన తర్వాత పాఠశాల అధికారాన్ని ఫిర్యాదు చేయమని అడిగా. అయితే విద్యార్థుల కెరీర్ను పాడుచేయవచ్చని నో చెప్పారు’’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నిత్యానంద్ భోక్తా చెప్పారు. ఉపాధ్యాయుడు సుమన్ కుమార్తో పాటు పాఠశాల క్లర్క్ సోనేరామ్ చౌరేను కట్టేసి కొట్టారు స్టూడెంట్. కొట్టడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయాలంటూ టీచర్ ను తిట్టడం కూడా వీడియోలో చూడొచ్చు.
Tags
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది