Jaguar Kumar: ఉక్రెయిన్ లో ‘తెలుగోడి’ గాండ్రింపు!
రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో భారత విద్యార్థులకు స్వదేశానికి పయనమవుతున్నారు.
- By Balu J Published Date - 12:34 PM, Tue - 8 March 22
రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో భారత విద్యార్థులకు స్వదేశానికి పయనమవుతున్నారు. అయితే ఒక ఇండియన్ డాక్టర్ మాత్రం ‘ఉక్రెయిన్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పేశాడు. సోషల్ మీడియాలో ‘జాగ్వార్ కుమార్’ అని పిలవబడే ఈ డాక్టర్ ఉక్రెయిన్ లోని డోన్బాస్ సమీపంలో ఓ బంకర్లో యాగ్వార్ అనే జాగ్వర్, సబ్రినా అనే నల్ల చిరుతపులి తో కలిసి ఉంటున్నాడు.
MBBS డిగ్రీ పూర్తి చేసి ఉక్రెయిన్లో స్థిరపడిన కుమార్ యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్నాడు. తాను పెంచుకుంటున్న జంతువుల గురించి, వైల్డ్ యానిమల్ గురించి, తాను పడే కష్టాలను వీడియోల తీస్తూ యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. 84,000 మంది సబ్ స్రైకర్స్ ఉన్న ఆ చానల్ కు మంచి పేరొచ్చింది. కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందినవాడు. యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఓ ఇంటర్వ్యూలో కుమార్ జంతువుల పట్ల తనకున్న ప్రేమ గురించి వివరించాడు. “నేను చిన్నప్పటి నుంచి అమితమైన జంతు ప్రేమికుడిని. లంకేశ్వరుడు సినిమా చూసినప్పుడు చిరంజీవి పులితో చేసిన నటనకు ఫిదా అయ్యాను. ఆ సినిమాను ఎన్నోసార్లు చూశా”అని చెప్పాడు.
MBBS చదివేందుకు ఉక్రెయిన్కు వెళ్లిను సింహం పిల్ల, బెంగాల్ పులి పిల్లను దత్తత తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత స్థానిక జంతుప్రదర్శనశాల ద్వారా జాగ్వర్ ఆరోగ్యం బాగాలేదని తనకు తెలియజేసినట్లు చెప్పారు. జంతువుకు చికిత్స చేసి, దాని ఆరోగ్యాన్ని మెరుగుపడిన తర్వాత, అవసరమైన అనుమతులు పొంది ఇంటికి తీసుకువచ్చినట్లు చెప్పారు. దాంతో పాటు ‘సబ్రినా’ అనే బ్లాక్ పాంథర్ని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని పెంచడానికి అయ్యే ఖర్చులు, కష్టాల గురించి మాట్లాడుతూ వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలు చాలామందికి రీచ్ కావడంతో కుమార్ కు బాగా పేరొచ్చింది. రష్యా యుద్ధం మొదలుకావడంతో ఉక్రెయిన్ విడిచిపెట్టడానికి ఇష్టపడడటం లేదు కుమార్. ఇదే విషయమై కుమార్ మాట్లాడుతూ.. “నా చివరి క్షణం వరకు (యాగ్వార్, సబ్రినా) రక్షించడానికి ప్రయత్నిస్తాను. వాటిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు” అంటూ రియాక్ట్ అయ్యాడు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ పౌరులు తమ పెంపుడు జంతువులను (కుక్కలు, పిల్లులు) తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తేనే స్వదేశానికి వస్తానని అంటున్నాడు కుమార్.
Related News
Maggi Noodles : నూడుల్స్ తిని బాలుడు మృతి.. కారణం తెలిస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు.