Rs 2 Charge On Order : ప్రతి ఆర్డర్ పై రూ.2 ఛార్జీ.. జొమాటో నిర్ణయానికి కారణమేంటి ?
Rs 2 Charge On Order : ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో ఇప్పుడు ప్రతి ఆర్డర్కు రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది..
- By Pasha Published Date - 10:56 AM, Tue - 8 August 23
Rs 2 Charge On Order : ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో ఇప్పుడు ప్రతి ఆర్డర్కు రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది..
“ప్లాట్ఫామ్ ఫీజు”గా ఈ 2 రూపాయలను తీసుకుంటోంది..
రూ.2 ఛార్జీ విధించిన పాప్ అప్ లో ఒక మెసేజ్ ఉంటోంది..
“జొమాటోను కొనసాగించడానికి 2 రూపాయల చార్జీని చెల్లించండి” అని ఆ మెసేజ్ లో స్పష్టంగా ఉంది..
ఈ చార్జీని అన్ని రకాల ఆర్డర్లపై వసూలు చేస్తున్నారు.
ఆర్డర్ రూ. 200 అయినా..రూ. 800 అయినా.. ఒక్కో ఆర్డర్కు “ప్లాట్ఫామ్ ఫీజు”గా రూ. 2 వసూలు చేస్తున్నారు.
Also read : Billionaire Businessman-Labour Grandson : వేల కోట్ల అధిపతి మనవడు లేబర్ గా మారాడు.. ఎందుకు ?
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే Swiggy ఇలాంటి చార్జీని వసూలు చేయడం మొదలుపెట్టింది. ఫుడ్ డెలివరీ కాస్ట్ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో స్విగ్గీ చెప్పింది. తాజాగా జొమాటో కూడా అదే బాట పట్టింది. డెలివరీ కాస్ట్ ను కవర్ చేసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో జొమాటో కూడా ఇలా 2 రూపాయల “ప్లాట్ఫామ్ ఫీజు”ను(Rs 2 Charge On Order) వసూలు చేయడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ రెండు రూపాయలతో పాటు Zomato, Swiggy సంస్థలు ప్రతి ఆర్డర్ విలువపై హోటల్స్, రెస్టారెంట్ ల నుంచి 22 నుంచి 28 శాతం మేర కమీషన్ కూడా తీసుకుంటాయి.
Also read : Affordable Electric Bicycles : 16వేలకే ఎన్నో ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్ !
Related News
e-Shram Card: ఈ కార్డు ఉంటే బోలెడు ప్రయోజనాలు.. నెలకు రూ.3000 పెన్షన్ కూడా..!
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కూలీలకు ప్రతినెలా రూ.1000 సాయం అందుతుంది.