Divorce Settlement: ఈ ‘‘విడాకులు’’ చాలా కాస్ట్లీ గురూ!
ఈరోజుల్లో ప్రేయసీ ప్రేమికుల మధ్య ‘బ్రేకప్’ అనే వ్యవహరం ఎంత కామన్ గా మారిందో.. భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడం కూడా చాలా సర్వసాధారణంగా మారిపోతోంది. అభిప్రాయ భేదాలో, ఇతర కారణాలో కానీ చిన్న చిన్న విషయాలకే ‘డివోర్స్’ బాట పడుతున్నారు.
- By Balu J Published Date - 12:10 PM, Wed - 22 December 21
ఈరోజుల్లో ప్రేయసీ ప్రేమికుల మధ్య ‘బ్రేకప్’ అనే వ్యవహరం ఎంత కామన్ గా మారిందో.. భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడం కూడా చాలా సర్వసాధారణంగా మారిపోతోంది. అభిప్రాయ భేదాలో, ఇతర కారణాలో కానీ చిన్న చిన్న విషయాలకే ‘డివోర్స్’ బాట పడుతున్నారు. అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరూ ‘తగ్గేదే ల్యా’ అంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఎంతోకొంత నష్టపరిహరం చెల్లించి విడాకుల ప్రక్రియ ముగిస్తారు. ఈ నేపథ్యంలో దుబాయ్ రాజు తన ఆరో భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహరం చాలా కాస్ల్టీగా మారింది. భరణంగా తన భార్యకు 5,525 కోట్లు చెల్లించుకోవాల్సి వచ్చింది.
దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ (72), ఆయన 6వ భార్య హయా బింట్ అల్ హుస్సేన్ (47) కొంతకాలంగా అనోన్యంగా ఉన్నారు. భార్య హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న బ్రిటన్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. ఏకంగా రూ. 5,525 కోట్ల మనోవర్తిని చెల్లించాలని దుబాయ్ రాజును ఆదేశించింది. ఇందులో రూ. 2,521 కోట్లను ఏకమొత్తంలో చెల్లించాలని తీర్పులో పేర్కొంది.
ఈ జంటకు అల్ జలిలియా (14), జయాద్ (9) పిల్లలున్నారు. పిల్లల ఖర్చుల కోసం కొన్ని కోట్లు ఇవ్వనున్నాడు. అయితే విడాకుల వ్యవహరం బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా మారాయి. కొన్ని కోట్లు భరణంగా ఇవ్వనున్న నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Tags
Related News
Air India: విమానం నుంచి దూకేస్తానని వ్యక్తి నానా హంగామా
ఎయిరిండియా విమానంలో నుంచి దూకేస్తానని బెదిరించిన కన్నూర్కు చెందిన వ్యక్తిని మమ్మగలూరులో అరెస్టు చేశారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వివరాలలోకి వెళితే..