HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Actions Will Be Taken If False Propaganda Is Done At Will Br Naidu

TTD : ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: బీఆర్‌ నాయుడు

తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Author : Latha Suma Date : 13-01-2025 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actions will be taken if false propaganda is done at will: BR Naidu
Actions will be taken if false propaganda is done at will: BR Naidu

TTD : ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన గురించి కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సోమవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ బీ.ఆర్ నాయుడు మాట్లాడుతూ.. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టవంతమైన ఘటనగా పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశామని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని… మరో 20 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక..టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.

కాగా.. ఈనెల 8న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ తొమ్మిది ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా గురువారం (జనవరి 10) తెల్లవారుజామున కౌంటర్లు తెరవాలని భావించినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బుధవారం రాత్రికే కౌంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మూడు ప్రాంతాల్లో ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. భక్తులు కౌంటర్ కేంద్రాల వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Read Also: Spinach Juice: శీతాకాలంలో ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎముకలు ఉక్కులా మారాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fake news
  • tirupati stampede
  • ttd
  • TTD Chairman BR Naidu

Related News

Sanatana Dharma

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని

  • Mehreen Pirzada

    నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

Latest News

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd