HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >A Key Turning Point In Maharashtra Politics Brothers And Sisters On The Same Platform After 20 Years

Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు

ఈ కార్యక్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్‌ ఠాక్రే (ఎంఎన్ఎస్‌) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్‌ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే.

  • By Latha Suma Published Date - 02:36 PM, Sat - 5 July 25
  • daily-hunt
A key turning point in Maharashtra politics.. Brothers and sisters on the same platform after 20 years
A key turning point in Maharashtra politics.. Brothers and sisters on the same platform after 20 years

Raj Thackeray : దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు ముంబయిలో జరిగిన ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్గాన్ని తెరలేపింది. మహారాష్ట్ర మంత్రివర్గం త్రిభాషా విధానం అమలును ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, ఈ కార్యక్రమం ప్రతిపక్షాల విజయోత్సవ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్‌ ఠాక్రే (ఎంఎన్ఎస్‌) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్‌ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ విభేదాల తర్వాత ఇదే తొలిసారి వీరు పబ్లిక్‌గా ఒకే వేదికపై కనిపించడం విశేషం.

Read Also: Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు

ఈ కార్యక్రమంలో రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ..త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నందున అసలు విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే వాదనను మోడీ ప్రభుత్వం అనవసరంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు, సినీనటులు ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదివినా, వారి మాతృభాషలపై గౌరవం తక్కువ కాలేదని తెలిపారు. మరాఠీలకూ తమ భాషపై అపారమైన గౌరవముందని, హిందీ భాషపై తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు రాజ్‌. అయితే హిందీని బలవంతంగా మిగతా రాష్ట్రాలపై రుద్దాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. మరాఠా సామ్రాజ్యం విస్తరించిన ప్రతి ప్రాంతంలో కూడా స్థానికులపై మరాఠీని రుద్దలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు భాషల విధానాన్ని ప్రభుత్వంగా అమలు చేయాలన్న ఆశతో ముందుకు సాగుతోంది అని విమర్శించారు.

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సహా దేశంలోని ఇతర హైకోర్టులన్నీ ఇప్పటికీ ఆంగ్లంలోనే ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రపైనే ఈ విధానం బలవంతంగా అమలు చేయాలని చూస్తే దాని తీవ్రత కేంద్రానికి త్వరలోనే అర్థమవుతుందని హెచ్చరించారు. అంతేకాక మమ్మల్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ఎవరూ చేయలేకపోయారు. తండ్రి బాల్‌ ఠాక్రేగారు కూడా చేయలేకపోయినదాన్ని.. ఫడణవీస్‌ చేసిన తప్పు వల్ల జరిగింది అని రాజ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. త్రిభాషా విధానంపై తీసుకున్న నిర్ణయంతోనే తమ కలయిక సాధ్యమైందని అన్నారు. ఈ ఘటన రాజకీయంగా చూస్తే, మహారాష్ట్రలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఈ కలయిక ఎప్పటికీ తాత్కాలికమా? లేక దీర్ఘకాల రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయినా, ఇటువంటి క్షణాలు మహారాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మకంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

Read Also :  Jharkhand : ఝార్ఖండ్‌ బొగ్గుగనిలో ప్రమాదం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Maharashtra
  • pm modi
  • Raj Thackeray
  • Three-Language Policy
  • Uddhav Thackeray

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd