HYD : వేదింపులు తట్టుకోలేక చెన్నై షాపింగ్ మాల్ బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య..
- By Sudheer Published Date - 02:48 PM, Mon - 5 February 24
హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం జరిగింది. వేదింపులు తట్టుకోలేక రమణమ్మ (50) అనే మహిళా చెన్నై షాపింగ్ మాల్ (The Chennai Shopping Mall ) బిల్డింగ్ ఫై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూకట్ పల్లి (Kukatpally) వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ వద్ద జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గత నాలుగు సంవత్సరాలుగా మాల్ లో హౌస్ కీపింగ్ గా రమణమ్మ పనిచేస్తుంది. కాగా హౌస్ కీపింగ్ కిలో పనిచేసే వారు కొంతకాలంగా రమణమ్మను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమెకూతురు జాష్ణవి ఆరోపిస్తుంది. నిన్న రాత్రి కూడా షాపింగ్ మాల్ లో అలాగే జరిగినట్లు ఆమె వెల్లడించింది. రోజూవారిలాగానే ఈరోజు కూడా డ్యూటీకి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తెలిపింది. రమణమ్మ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని…మాల్ లో పనిచేసే వారి వల్లే జరిగిందని ఆరోపించింది.
ఆత్మహత్యకు పాల్పడే ముందు తన కొడుకుకు వాయిస్ రికార్డు పంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి పోలీసులు. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also : Sugar Factories: తెలంగాణలో చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి