TS : అమ్మవారి హుండీలో 100కోట్ల రూపాయల చెక్కు…కానుక ఇచ్చింది ఎవరో తెలుసా..?
జోగులాంబ దేవాలయం...తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ఈ అమ్మవారి దేవాలయంలో వార్తల్లో నిలిచింది.
- By hashtagu Published Date - 09:16 PM, Sun - 16 October 22
జోగులాంబ దేవాలయం…తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ఈ అమ్మవారి దేవాలయంలో వార్తల్లో నిలిచింది. ఓ అజ్నాత భక్తుడు హుండీలో 100కోట్లరూపాయల చెక్కు కానుకగా వేయడం చర్చనీయాంశంగా మారింది. వందకోట్లు రూపాయల చెక్కును హుండీలో గుర్తించిన ఆలయ అధికారులు…భక్తుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వందకోట్ల చెక్కును కానుకగా వేసింది భక్తుడు కాదని తేలింది. ఈ చెక్కు హుండీలో వేసిన బ్యాంక్ అకౌట్ ఏపీలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్ బ్రాంచీకి చెందినదని గుర్తించారు పోలీసులు.
హుండీలో వేసింది ఆలంపూర్ మండలానికి చెందిన భక్తుడిగా గుర్తించారు. అతని బ్యాంకులో కేవలం 23రూపాయలు ఉంటే…వంద కోట్ల చెక్కు వేయడంపై పోలీసులు ఆరా తీశారు. అతనికి మతిస్తిమితం లేదని తెలియడంతో…చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అతనికి మతిస్థితిమితం లేకపోయినప్పటికీ…చెక్కు ఆర్మీ జవాన్ల కోసమని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మతిస్తిమితం లేకున్నా..వందకోట్ల చెక్కు హుండీలో వేశాడంటే..అతనికి మంచి చేయాలన్న ఆలోచన వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Tags
Related News
TS : విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వంః హారిశ్ రావు
Electrical System: సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆయన అన్నారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. We’re now on Whats