Congress Vs MIM: అసెంబ్లీలో మాటల యుద్ధం, అక్బర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్!
- By Balu J Published Date - 05:00 PM, Thu - 21 December 23
ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా వాడీవేడిని రేపాయి. ముఖ్యంగా ఎంఐంఎం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా మాటల తుటాలు పేల్చారు. విద్యుత్ బకాయిలపై సీఎం రేవంత్ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల పేర్లు ప్రస్తావించగా, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలుగజేసుకొని బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందన్నారు. పాతబస్తీలో గత బీఆర్ఎస్ హయాంలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దీంతో అక్బర్ మరోమారు కలుగజేసుకొని ఇతర అంశాలను ప్రస్తావిస్తూ.. ఎఐంఎంను బీజీపీ బీటీమ్ గా కాంగ్రెస్ చీత్రికరించిందని ఫైర్ అయ్యారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి పైర్ అయ్యారు. తెలంగాణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అజారుద్దీన్, షబ్బీర్ అలీని ఓడించడానికి ఎంఐం పనిచేసిందని, సాటి ముస్లింలను ఓడించిన ఘనత ఎంఐఎందేనని సీఎం ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంతో ఎంఐఎం కలిసి అనేక చర్యలకు పాల్పడిందని, ఎంఐఎం గురించి పెద్ద కథే ఉందని ఆయన ప్రస్తావించారు. దీంతో అక్బర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తో కలిసి పనిచేయబోం అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అవుతూ అక్బరుద్దీన్ సభను తప్పుదొవ పట్టించవద్దని సూచించగా, డిప్యూటీ సీఎం భట్టి అక్బర్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
Also Read: Covid Deaths: ఇండియాపై కరోనా పంజా, 2 వారాల్లో 23 మంది మృతి
Related News
IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
IPL 2024: ధోనీ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానిక�