HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vinod Kumar Slams Nirmala Sitharaman On Telangana Finances

Vinod Kumar : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్

Vinod Kumar : వినోద్ కుమార్ మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితమైనవని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే అమలులోకి వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఈ చట్టం రూపొందడంలో నైతికంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికో లేదా నిర్మలా సీతారామన్‌కో ఎటువంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ , ప్రజలు కలసి పోరాడారని గుర్తు చేశారు.

  • Author : Kavya Krishna Date : 14-02-2025 - 5:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boinapally Vinod Kumar
Boinapally Vinod Kumar

Vinod Kumar : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ విభజన సమయంలో సురప్లస్ రాష్ట్రంగా ఉన్నప్పటికీ, గత పదేళ్లలో అప్పులు పెరిగాయని రాజ్యసభలో సీతారామన్ వ్యాఖ్యానించారు.

వినోద్ కుమార్ మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితమైనవని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే అమలులోకి వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఈ చట్టం రూపొందడంలో నైతికంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికో లేదా నిర్మలా సీతారామన్‌కో ఎటువంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ , ప్రజలు కలసి పోరాడారని గుర్తు చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనను నిర్మలా సీతారామన్ అప్రతిష్ఠపర్చేలా వ్యాఖ్యలు చేశారని బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యే ముందు , 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు సురప్లస్ బడ్జెట్‌తో ఉన్నదని ఆయన గుర్తు చేశారు. అప్పులు పెరిగిన మాట వాస్తవమే అయినా, కేసీఆర్ సర్కారు ఆ అప్పులను సమర్థవంతంగా ఉపయోగించి రాష్ట్రానికి విలువైన ఆస్తులను సృష్టించిందని స్పష్టం చేశారు.

Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై అట్రాసిటీ కేసు

తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వం లో జరిగిన ముఖ్యమైన ప్రాజెక్టులను వినోద్ కుమార్ వివరించారు. కొత్తగా జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు, కాలేశ్వరం ప్రాజెక్టు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి కీలక భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పరిపాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య రంగంలో తెలంగాణ పెద్ద కదలిక చూపిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం రాబడిన ఆదాయం ఐదు రెట్లు పెరిగినప్పటికీ, కేవలం అప్పుల గురించే మాట్లాడటం ఎందుకు అని వినోద్ కుమార్ నిలదీశారు. నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తే ఇక్కడ అభివృద్ధిని స్వయంగా చూడగలరని సూచించారు. సీతారామన్‌ వ్యాఖ్యలు తెలంగాణ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని, దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రం కూడా కారణమని విమర్శించారు.

బీజేపీ నేతలు మేదక్ రైల్వే స్టేషన్ గురించి గొప్పలు చెప్పుకోవడం ఎట్లా సాధ్యం అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పలు సంవత్సరాల పాటు ఆలస్యమయ్యిందని, చివరికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ చొరవతోనే పూర్తి అయ్యిందని గుర్తు చేశారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, పైగా తెలంగాణపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.

Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • kcr
  • nirmala sitharaman
  • telangana development
  • Telangana Finances
  • vinod kumar

Related News

Brs Grama

Grama Panchayat Elections : తెలంగాణ లో మా ప్రభంజనం మొదలైంది – బిఆర్ఎస్

Grama Panchayat Elections : గతంలో తమ పార్టీ సుమారు 64% సీట్లు గెలుచుకుంటే, ప్రస్తుత తొలి దశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 44% స్థానాలనే గెలుచుకోగలిగిందని గణాంకాలతో సహా పోల్చి చూపింది

  • Bjp Support Telangana Risin

    Telangana Rising Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్ కు మద్దతు ప్రకటించిన బీజేపీ

Latest News

  • Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Divi Vadthya Bikini : బికినీ లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన దివి

  • Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

  • New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

Trending News

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd