Telangana : విజయశాంతి బిజెపి కి బై..బై చెప్పబోతుందా..?
విజయశాంతి తీరుతో బిజెపి శ్రేణుల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ.. కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.
- By Sudheer Published Date - 07:34 PM, Wed - 20 September 23
తెలంగాణ లో బిజెపి (Telangana BJP) పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. బండి సంజయ్ (Bandi Sanjay) రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత చేపట్టినప్పుడు బిజెపి లో జోష్ కనిపించింది..దుబ్బాక , GHMC , హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలవడం, ఇతర పార్టీల నేతలు సైతం వారి సొంత పార్టీలకు రాజీనామా చేసి బిజెపి లో చేరడం తో పార్టీ కి కళ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ కళ కొనసాగలేకపోయింది. అనూహ్య కారణాలతో బండి సంజయ్ ని అధ్యక్షా పదవి నుండి తొలగించడం తో రాష్ట్రంలో బిజెపి కళ పూర్తిగా మారిపోయింది. సంజయ్ ని తప్పించడం ఫై చాలామంది నేతలు నిరాశకు గురైయ్యారు. కార్యకర్తల్లోనూ ఉత్సాహం తగ్గింది. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాలు సైతం బిజెపి శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. బిజెపి ని నమ్ముకుంటే కుదరదని కాంగ్రెస్ బాట పడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) జోష్ పెరుగుతుండడం..కీలక బిఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరుతుండడం తో బిజెపి లో ప్రస్తుతం ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజాగా రాములమ్మ విజయశాంతి (Vijayashanti ) సైతం బిజెపి ని వీడబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా రాములమ్మ ప్రవర్తన లో చాల తేడాలు కనిపిస్తున్నాయి. మొన్న సోనియాను అభిమానిస్తామని ట్వీట్ చేసిన విజయశాంతి తాజాగా బీజేపీ పోటీలోనే లేదంటూ బాంబ్ పేల్చారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారని ట్వీట్ చేశారు. విజయశాంతి తీరుతో బిజెపి శ్రేణుల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ.. కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అటు బీజేపీ కోర్ మీటింగ్లకు సైతం విజయశాంతి డుమ్మా కొడుతుండడం తో.. ఆమె త్వరలోనే కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Read Also : Adilabad : మహిళ ఎస్సై అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అంగన్వాడీలు
వాస్తవానికి విజయశాంతి మొదటగా బీజేపీలో చేరారు..ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు..అది వర్క్ అవుట్ కాకపోవడం తో బిఆర్ఎస్ లో చేరారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడం తో 2014లో కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా డౌన్ కావడం తో.. 2020లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపి లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాములమ్మ ను బిజెపి అధిష్టానం ఆపుతుందో..లేక పోతే పోనీ అని వదిలేస్తుందో చూడాలి.
Tags
Related News
Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.