Twitter Memes: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై ట్విట్టర్లో మీమ్స్..!
బుధవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
- By Gopichand Published Date - 03:07 PM, Thu - 27 October 22
బుధవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన సంఘటన జరిగినప్పటి నుండి #TelanganaNotForSale, #TelanganaWithKCR, #Telanganaisnotforsale, #TelanganaPoachingClaim హ్యాష్ట్యాగ్లు అత్యంత ట్రెండింగ్ లో ఉన్నాయి.
హ్యాష్ట్యాగ్లు కాకుండా చాలా ఫొటోలు పోస్ట్ చేయబడ్డాయి. ప్రతి పక్షం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తమను తాము సమర్థించుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ @trspartyonline అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. టిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి ‘ఆపరేషన్ లోటస్’ అంటూ అమిత్ షా, కెసిఆర్ తో కూడిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. అంతేకాకుండా బీజేపీ పెద్దలా లేక ఢిల్లీకి గద్దలా అని పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ట్విట్టర్ పోస్ట్లో ఆరోపించారు: ఇది సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర. కేసీఆర్. మీరు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి గుడికి రండి.. మేమంతా అక్కడికి వస్తాం.. ఇదంతా నిజంగా జరిగిందని, ఇందులో మీ ప్రమేయం లేదని ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అరవింద్ ధర్మపురి ట్వీట్ చేస్తూ ‘‘ఎన్నికల ముందు కేసీఆర్ చేష్టలు తెలంగాణ ప్రజలకు తెలుసు! వేల కోట్ల రూపాయలను ఎలా సొంతం చేసుకున్నాడు? అని ట్వీట్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్కు మద్దతుగా ట్విట్టర్ వేదికగా పలు ఫన్నీ మీమ్స్ కూడా కనిపించాయి. మునుగోడు ఉపఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాటకం రానున్న రోజుల్లో ఏన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Related News
Siddaramaiah: ‘‘ఆపరేషన్ లోటస్.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్’’
Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ