TRS NRIs: కేసీఆర్ జాతీయ పార్టీకి ఎన్నారైల మద్ధతు
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం సంపూర్ణ మద్ధతు ప్రకటించింది.
- Author : CS Rao
Date : 13-06-2022 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ రాజకీయ పార్టీని ప్రారంభించాలనే ఆలోచనను గట్టిగా సమర్థించింది. టీఆర్ఎస్ ఎన్నారై వింగ్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వివిధ దేశాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి మద్దతు పలికారు. భారతదేశానికి రావు నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.
చంద్రశేఖర్రావు నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు వ్యక్తులు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు ఏమి సాధించగలడో ముఖ్యమంత్రిగా నిరూపించారని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు అవసరమని, అది చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం అపారమైన సహజ వనరులతో ఆశీర్వదించబడినప్పటికీ, వాటిని దేశాభివృద్ధికి ఏ ప్రభుత్వాలు సక్రమంగా ఉపయోగించుకోలేదని, కేంద్రంలోని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు మతపరమైన చీలికలను సృష్టించడంపై మాత్రమే ఆసక్తి చూపుతుందని సమావేశం తీర్మానించింది. ఇలాంటి విభజన అంశాల నుంచి దేశాన్ని కాపాడేందుకు, ప్రజాకేంద్రాభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందించాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమావేశం అభిప్రాయపడింది.