TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.
- By Hashtag U Published Date - 12:10 AM, Sun - 19 December 21
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు. ఈ టూర్ లో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని అపాయింట్మెంట్ కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మండిపడుతోంది. ఏడేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన దోహదపడుతుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయిందని, మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలం పంటనంతా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు.
గత నెల క్రితమే సీఎం కేసిఆర్తో పాటు మంత్రులు ఎంపీలు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మంత్రులను కలిసి చర్చించారు. అయినా కేంద్రం తాను ముందు చెప్పినట్టుగానే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రులు సైతం ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రాతపూర్వకంగా ఒప్పందం ఇచ్చి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారంటూ కేంద్రమంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఇక కేంద్రం చెప్పినట్టు రాష్ట్రంలోకూడా వేసవి వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా చెప్పారు.
అయితే ఢిల్లీ వెళ్లి ధాన్యం విషయంలో ఎదో ఒకటి తేల్చుకునే రావాలని కేసీఆర్ సీరియస్ గా చెప్పడంతో ఈసారి పర్యటన, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Related News
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.