TRS : కారు కంచుకోటలు బీటలు!
ఆవిర్భావ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.
- By Balu J Published Date - 11:52 AM, Sat - 30 July 22
ఆవిర్భావ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. అసలు కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదని అంతా అనుకున్నారు. ఇక అలా అలా 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ కొన్ని సీట్ల వరకు గెలుచుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది… ఊహించని విధంగా 2014లో 60కి పైనే సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో బలం లేదని తేలింది. దీంతో కేసీఆర్ అనూహ్యంగా టీడీపీని దెబ్బకొట్టారు..ఆ పార్టీ నేతలని లాగేశారు.
దీంతో టీడీపీ కేడర్ టీఆర్ఎస్ వైపుకు వచ్చింది..అలాగే కాంగ్రెస్ ని కూడా నిదానంగా దెబ్బకొడుతూ వచ్చారు..ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో భారీ విజయం అందుకున్నారు. అక్కడ నుంచి కాంగ్రెస్ పై ఇంకా ఫోకస్ పెట్టి..ఆ పార్టీని దెబ్బకొట్టారు. ఇలా టీడీపీ-కాంగ్రెస్ లని దెబ్బకొట్టి టీఆర్ఎస్ బలపడింది. అయితే ఇంకా తిరుగులేదనుకునే సమయంలో బీజేపీ ఎదుగుతూ వచ్చింది.. అలాగే కాంగ్రెస్ కూడా నిదానంగా పుంజుకుంటుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి అంతా రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది…ఇప్పటివరకు బలపడుతూ వచ్చిన టీఆర్ఎస్ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతూ వస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి మొదట నుంచి అండగా ఉంటూ వస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీన్ రివర్స్ అవుతూ వస్తుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు రాబడుతుంది. ఇక 2018 ఎన్నికల్లో నిజామాబాద్ లో క్లీన్ స్వీప్ చేయగా, కరీంనగర్ లో 13 సీట్లకు 12 సీట్లు గెలుచుకుంది. అంటే రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో కారు రివర్స్ అవుతుంది…ఈ రెండు జిల్లాల్లో బీజేపీ పుంజుకుంది…టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ ఎదిగింది. నిజామాబాద్ లో కారు పార్టీకి కమలం ధీటుగా పుంజుకుంది. అటు కరీంనగర్ లో కమలంతో పాటు కాంగ్రెస్ కూడా పికప్ అవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ కారు కంచుకోటలు కూలిపోయేలా ఉన్నాయి.
Related News
Koppula: కాంగ్రెస్ పాలనలో మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి పోయినట్టు ఉంది: కొప్పుల
Koppula: పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో రామగుండం మాజీ 8 ఇన్ క్లైన్ లో ప్రచారం నిర్వహించి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత దండుగ అన్నా వ్యవ