MLA Gadari Kishore : కాంగ్రెస్, బీజేపీవి భూటకపు హామీలు – బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్
తనను మూడోసారి ఆశీర్వదిస్తే తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానన్నారు
- By Sudheer Published Date - 07:08 PM, Sat - 18 November 23
తెలంగాణ ఎన్నికల (Telangana Elections ) వేడి సమ్మర్ ను తలపిస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార ..ప్రతిపక్ష పార్టీలన్ని కూడా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఉదయం 5 గంటలనుండే ప్రచారం చేస్తూ ప్రతి ఇంటిగడపకు వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక తుంగతుర్తి (Thungathurthy )లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ (Thungathurthy MLA Gadari Kishore) తన ప్రచారంతో(Election Campaign) హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ (KCR) అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శల వర్షం కురిపిస్తూ తన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.
ప్రజలు ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి విజయతిలకం దిద్దుతున్నారు. వృద్ధులు ఆప్యాయంగా పలుకరించి కొడుకా నీకే మా ఓటు అని చెపుతూ భరోసా ఇస్తున్నారు. ఇక ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..తనను మూడోసారి ఆశీర్వదిస్తే తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని రూ.16 వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. అందుకే నియోజక వర్గం ప్రజలకు రెండోసారి సేవ చేసే అవకాశం కల్పించారన్నారు.
ఇదే రీతిన మరోమారు ఉద్యమ స్ఫూర్తితో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 30 ఏళ్లలో సాధ్యంకాని అభివృద్ధిని తాను తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసినట్లు తెలిపారు. గత ఐదేండ్లలో ఎన్నడూ ప్రజా సమస్యలు పట్టించుకోని వారు సంక్రాంతి పండుగకు గండిరెద్దులు వచ్చినట్లుగా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ , బిజెపి లపై విమర్శలు కురిపించారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బీఆర్ఎస్(BRS) పార్టీతోనే సాధ్యమవుతుందని… కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని.. గత పాలకులు పట్టించుకోని నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రభుత్వం తో అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోతే గోసపడతామని ప్రజలకు సూచించాడు. కాంగ్రెస్ మాటలు నమ్మి కాదు..కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని గాదరి కిషోర్ కోరారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని, మూడు గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు కావాలో.. 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లేదని, మీలో ఒకడిలా ఉంటున్న తనను ఆశీర్వాదించాలని ప్రజలను ఆయన కోరారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే 24 గంటల కరెంట్ ఇవ్వరని, రైతు బంధు బంద్ చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీవి భూటకపు హామీలని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రసుత్తం రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా ఎన్నికల అనంతరం దాన్ని రూ.16 వేలకు పెంచనున్నట్లు అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు.
ఇక గాదరి కిశోర్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే..2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (TRS) తరపున తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై 2,379 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత గాదరి కిశోర్ ను సీఎం కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీగా నియమించడమే కాకుండా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను అప్పగించాడు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా మరోసారి అద్దంకి దయాకర్ పై 1,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యాడు.
Read Also : KTR: పాతబస్తీలో కేటీఆర్ పర్యటన.. జనంతో మాట ముచ్చట
Related News
Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి
కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.