BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్
- By Balu J Published Date - 06:20 PM, Tue - 19 March 24
BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస్తుందని హెచ్చరించారు. తాను భాజపాలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన మాజీ మంత్రి… గుడికి వెళ్తే ఆ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేయటం తగద్నారు.
పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సోమవారం ఆయన స్పీకర్ ప్రసాద్కుమార్ను కలుసుకున్న విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ కూడా స్పందిస్తూ.. పార్టీని వీడేవాళ్లంతా చిల్లరగాళ్లంతో సమానమని అన్నారు.
Related News
Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద�