HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Development Of Medaram Is The Destiny Of All Of Us Cm Revanth

CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నాను: సీఎం రేవంత్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. "కుంభమేళాకు వేల కోట్లు ఇచ్చినట్లుగా మేడారం జాతరకూ నిధులు ఇవ్వాలి.

  • Author : Gopi Date : 23-09-2025 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ భాగ్యం తమ ప్రభుత్వానికి దక్కిన గొప్ప అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం నాడు మేడారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్థిక సంక్షోభం ఉన్నా నిధుల కొరత ఉండదు

గతంలో ప్రభుత్వాలు నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని గతంలో చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనుకాడం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిలో సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేస్తామని, గిరిజన వారసులను కలుపుకొని ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

వేయి సంవత్సరాలు చెక్కుచెదరని నిర్మాణాలు

మేడారం ప్రాంగణాలను రాతి కట్టడాలతో నిర్మించి, వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా చేస్తామని సీఎం అన్నారు. “రామప్ప ఆలయంలాగే మేడారం తల్లుల మందిరం కూడా చెక్కుచెదరని నిర్మాణంగా ఉంటుంది” అని ఆయన ఉద్ఘాటించారు. వంద రోజుల్లోనే ప్రణాళికలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం ఉదయం, రాత్రి తేడా లేకుండా కార్మికులు శ్రమిస్తారని, స్థానికులు వారిని కాపాడుతూ పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఇంచార్జీ మంత్రి పొంగులేటి ప్రతీ వారం పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. “అయ్యప్ప మాల ధారణ అంతటి శ్రద్ధతో పనులు పూర్తి చేయాలి. ఈ సారి జాతరను అత్యద్భుతంగా జరుపుకుందాం” అని అధికారులకు సూచించారు.

తమ ప్రభుత్వం బాధ్యతతో పాటు భావోద్వేగం కలిసిన పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా మేడారం సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం తీసుకుని పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు వరుసగా 18 సార్లు అమ్మవార్ల దర్శనానికి వచ్చానని తెలిపారు.

గతంలో అధికారంలో ఉన్న పెద్దలను మేడారం అభివృద్ధి కోసం నిధులు అడిగితే అరకొర నిధులు మాత్రమే ఇచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. తాను చేపట్టిన పాదయాత్రను ‘మా ఇంటి ఆడబిడ్డ నియోజకవర్గం’ అయిన మేడారం నుండే ప్రారంభించానని తెలిపారు. ప్రజలకు ప్రజా పాలన అందించేందుకు ఇక్కడి నుండే సంకల్పంతో అడుగులు వేశానని చెప్పారు.

కేంద్రానికి సీఎం అప్పీల్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. “కుంభమేళాకు వేల కోట్లు ఇచ్చినట్లుగా మేడారం జాతరకూ నిధులు ఇవ్వాలి. మేడారం జాతరకు జాతీయ హోదా, నిధులు ఇవ్వాలని మేడారం సాక్షిగా అప్పీల్ చేస్తున్నాను” అని ఆయన అన్నారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే, తాను ఏమీ అననని, సమ్మక్క సారలమ్మలే అన్నీ చూసుకుంటారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం మేఘాలు రావడంతో కొందరు పర్యటన ఆపేయాలని సూచించారని, కానీ తాను సమ్మక్క తల్లి అన్నీ చూసుకుంటుందని ధైర్యంగా ముందుకు సాగానని, వనదేవతల ఆశీర్వాదం, ప్రకృతి సహకారంతో వెనకడుగు వేయలేదని ముఖ్యమంత్రి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Medaram Jathara
  • Sammakka Sarakka Jatara
  • telangana
  • telugu news

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd