Data Scam: దేశంలో బిగ్గెస్ట్ డేటా స్కామ్.. 16 కోట్ల మంది డేటా చోరీ!
నిత్యం సోషల్ మీడియా ఆప్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారా? కీలక బ్యాంకుల్లో భారీగా సేవింగ్స్ చేశారా?
- By Balu J Published Date - 05:04 PM, Thu - 23 March 23
మీరు ఫేస్ బుక్ (Face Book), వాట్సాప్ ద్వారా కీలక, వ్యక్తిగత డేటాను షేర్ చేస్తున్నారా? నిత్యం సోషల్ మీడియా ఆప్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారా? కీలక బ్యాంకుల్లో భారీగా సేవింగ్స్ చేశారా? అయితే చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. రోజురోజురోజకు సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న నేపథ్యంలో డేటా చౌర్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటా (Data Scam)ను చోరీ చేసిన తొమ్మిది మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గురువారంనాడు సైబారాబాద్ సీపీ ష్టీఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు అందించారు.
వ్యక్తిగత డేటా చోరీ
వ్యక్తిగత డేటాను (Data Scam) సేకరించి ఈ ముఠా విక్రయిస్తుందని సీపీ తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల డేటాతో పాటు ఇతరుల డేటాను కూడా అమ్మకానికి పెట్టారని సీపీ చెప్పారు. ఫేస్ బుక్ యూజర్ల ఐడీ, పాస్ వర్డ్ లను కూడా ఈ ముఠా చోరీ చేసిందని సీపీ వివరించారు. రుణాలు, భీమా కోసం ధరఖాస్తు చేసుకున్న వారి డేటాను కూడా ఈ ముఠా చోరీ చేసిందని సీపీ తెలిపారు. ఐటీ ఉద్యోగుల డేటా కూడా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కీలక డేటాను ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుందని సీపీ చెప్పారు. కీలక డేటాను విక్రయించడం దేశ భద్రతకు ముప్పు అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళల వ్యక్తిగత డేటా కూడా విక్రయించారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల్లో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఎజేన్సీ ఉద్యోగి అని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
బ్యాంకు ఖాతాల సమాచారం కూడా
కీలకమైన బ్యాంకు ఖాతాల సమాచారం కూడా నిందితులు చోరీ చేశారని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ డేటా లీక్ తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఈ ముఠాలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు, నాగ్ పూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. డేటా చోరీ గ్యాంగ్లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేసినట్లు వెల్లడించారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడ్డారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారని సీపీ తెలిపారు. దేశంలో 140 రంగాలకు చెందిన 16 కోట్ల 80 లక్షల మంది వ్యక్తిగత డేటా (Data Scam)ను పోలీసులు చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. హై సెక్యూరిటీ బ్యాంకుల నుండి కూడా డేటా లీక్ అయిందని సీపీ తెలిపారు.
Also Read: Ram Charan Emotion: ఆ దృశ్యాన్ని తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు: రామ్ చరణ్
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.