Telangana 10th Telugu: సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ స్కూల్లలో తెలుగు తప్పనిసరి!
ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే.
- By Anshu Published Date - 09:18 PM, Sun - 19 June 22

ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం గురించి కీలక ప్రకటన చేసింది. సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు లో గుర్తింపు పొందిన స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ సంవత్సరం ఎలాగైనా వార్షిక పరీక్షలో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది అని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పదోతరగతి వార్షిక పరీక్షలో తెలుగు పేపర్ ను తప్పనిసరిగా ప్రవేశ పెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం మాత్రం సీబీఎస్సీ, ఐబీ, ఐసీఎస్ఈ బోర్డుల ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లలో బహు భాషా విధానం అమల్లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో 1 నుంచి 4 తరగతుల్లో ఏదైనా రెండు భాషలు నేర్చుకోవాలని..