Telangana: దేశంలోనే ఆర్థికవృద్ధి రేటులో ‘తెలంగాణ’ టాప్
#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
- By Balu J Published Date - 04:42 PM, Wed - 2 March 22
#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో తెలంగాణ నాయకులకు అసలు పరిపాలన చేతనవుతుందా అని మొదలైన అపోహల నుంచి నేడు ఎనిమిదేళ్ల కాలంలో అత్యధిక వృద్ధిరేటు సాధించి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
కేవలం ఒక రంగం అన్ని కాకుండా అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కేటీఆర్ చేసిన ట్వీట్ రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ ట్వీట్ ను సమర్థిస్తూ.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యావత్ సమాజం కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ.. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో తమ ట్వీట్ల ద్వారా వివరించారు. ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ అంటూ.. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని, కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్ధిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కేంద్రంలోని మోడీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. సొంతంగా తన కాళ్ళ మీద తానూ నిలబడిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు జరుగుతన్న అభివృద్ధి భావి తెలంగాణకు గొప్ప భరోసా అని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును, వివక్షను పెద్దఎత్తున ఎండగట్టారు. 2014 లో 5 లక్షలుగా ఉన్న జీఎస్డీపీ 2022 నాటికి 130 శాతం అభివృద్ధిని నమోదు చేస్తూ 11.54 కోట్లకు ఒక్క కేసీఆర్ గారి పాలనా సామర్థ్యం తోనే సాధ్యమయింది అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 50 వేలకు పైగా ట్వీట్లతో ట్విట్టర్లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తి దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది.
IT and Industries Minister @KTRTRS addressed the industry leaders at the @FollowCII Telangana State Leadership Summit 2021-22 in Hyderabad. #TriumphantTelangana pic.twitter.com/O1YH9aeNMa
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 2, 2022
Related News
Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి
ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి.