Arogya Mahila Clinics: సెప్టెంబరు 12 నుంచి మరో 100 ఆరోగ్య మహిళా క్లినిక్లు
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
- Author : Vamsi Chowdary Korata
Date : 07-09-2023 - 9:34 IST
Published By : Hashtagu Telugu Desk
Arogya Mahila Clinics: తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 12 నుంచి అదనపు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆరోగ్య మహిళా పథకాన్ని 272 కేంద్రాల నుంచి అమలు చేస్తుండగా, సెప్టెంబర్ 12 నుంచి కేంద్రాల సంఖ్య 372కి పెరగనుంది. ఆరోగ్య మహిళా క్లినిక్లు ప్రతి మంగళవారం పనిచేస్తాయి. మహిళల కోసం వారానికోసారి క్లినిక్లు నిర్వహించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చిలో ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆరోగ్య మహిళా పథకం కింద 1.85 లక్షల మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. అదనపు చికిత్స అవసరమైతే జిల్లా ప్రధాన ఆసుపత్రికి రోగులను రిఫర్ చేయడంతో పాటు, ఉచిత మందులు మరియు పరీక్షలు ఈ పథకంలోని వర్తిస్తాయి. పథకం కింద 1,42,868 మంది వ్యక్తులు నోటి క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లు 1,41,226 చేస్తే… 1,313 మందికి లక్షణాలు కనిపించాయి. వీరిలో 26 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. గర్భాశయ క్యాన్సర్ కోసం 33,579 మంది మహిళలు పరీక్ష చేయించుకున్నారు.1,340 మందిలో లక్షణాలు బయటపడ్డాయి. 26 మంది రోగ నిర్ధారణ అయింది.
Also Read: TCongress: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టుపై ఉత్కంఠత, CWC తర్వాతనే అనౌన్స్!