Diwali 2023 : హైదరాబాద్లో 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి
దీపావళి అంటేనే బాంబుల మోత..ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువ. రెండు రోజుల నుండే నగరం బాంబుల మోతతో మోగిపోతుంటుంది
- By Sudheer Published Date - 03:28 PM, Sat - 11 November 23
నగరవాసులకు షాకింగ్ న్యూస్..నగరంలో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad) సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. రెండు గంటలు మించి టపాసులు కలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీపావళి అంటేనే బాంబుల మోత..ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువ. రెండు రోజుల నుండే నగరం బాంబుల మోతతో మోగిపోతుంటుంది. ఈసారి ఎన్నికల మూలాన కొద్దీ రోజులుగా మోత మోగుతూనే ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ ఏడాది దీపావళి మోతను పోలీసులు కాస్త కట్టడి చేశారు. దీపావళి పండుగ రోజు రాత్రి రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. దీపావళి నాడు పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువగా టపాసులు పేలుస్తుంటారు. ఇక హైదరాబాద్లో అయితే మరీ అధికం. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని టైమ్ లిమిట్లోనే టపాసులు కాల్చాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ రెండు గంటలు మినహా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చవద్దని, ముఖ్యంగా శబ్దం అధికంగా వచ్చే టపాసులను పేల్చవద్దని పోలీసులు సూచించారు.
ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు 12వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు వరకూ అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
Read Also : Chandra Mohan: చంద్ర మోహన్ స్వయంగా ఎంపిక చేసిన టాప్ 30 సాంగ్స్ ఇవే
Related News
KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేశారు.