Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 03-01-2024 - 5:48 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్
ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
సీఎంవో సంయుక్త కార్యదర్శిగా సంగీతా సర్వే సత్యనారాయణ
నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచంద్ర
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా
ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా డి. దివ్య
ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్
పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతీ హోలికేరి
టీఎస్ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టెం లక్ష్మీ
టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీగా క్రిష్ణ ఆదిత్య
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
హైదరాబాద్ (స్థానిక సంస్థలు) అడిషనల్ కలెక్టర్ పి కదిరావన్
బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం
నల్గొండ జిల్లా కలెక్టర్గా దాసరి హరి చందన
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్
రంగారెడ్డి కలెక్టర్గా శశాంక
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి నియామకం
గద్వాల జిల్లా కలెక్టర్గా బీఎం సంతోష్