Komatireddy meets Modi: కోమటిరెడ్డికి ‘మోడీ’ అపాయింట్ మెంట్.. కాంగ్రెస్ కు షాక్!
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి (Komatireddy) మోడీతో భేటీ కాబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది.
- By Balu J Published Date - 04:00 PM, Thu - 15 December 22
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy) రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని కలవనున్నారు. సీనియర్ కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ పై గుర్రుగా ఉన్నాడు. కొత్త కార్యవర్గంలో తన పేరు కనిపించకుండా పోవడంతో మరుసటి రోజు ఆయనకు గట్టి షాక్ తగిలింది. వెంటనే కోమటిరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై పార్టీ అంతర్గత విషయాలపై చర్చించారు.
ఈ భేటీ అనంతరం కోమటిరెడ్డి (Komatireddy) చల్లబడ్డారని, త్వరలోనే ఆయన టీ-కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారని కొందరు అంటున్నారు. అయితే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోమటిరెడ్డి ఇంకా పనిచేసే మూడ్లో లేరన్నది వాస్తవం. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రేవంత్ని ఆ పదవి నుంచి తొలగిస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇంకా కోమటిరెడ్డి కోరుకున్న టీ-పీసీసీ చీఫ్ రోల్ తనకు దక్కదేమోనని భావిస్తున్నాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి ఉంటే.. వెంకట్ రెడ్డి (Komatireddy) ఈపాటికి బీజేపీలో చేరి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాని మోదీని కలిసిన తర్వాత వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగడంపై కూడా స్పష్టత వస్తుందని పలువురు నేతలు భావిస్తున్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) తన లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించేందుకే ప్రధాని మోదీని కలుస్తున్నారని టీ-కాంగ్రెస్ చెబుతోంది. “ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిని లేదా ఇతర కేంద్ర మంత్రిని కలవవచ్చు. అందులో తప్పేమీ లేదు’’ అని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Also Read: Katrina Kaif Looks: కవ్విస్తున్నా కత్రినా.. స్టన్నింగ్ లుక్స్ లో కేక!
Related News
400 Paar : ఈసారి బీజేపీకి 200 సీట్లు కూడా అతికష్టమే.. శశిథరూర్ జోస్యం
400 Paar :ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ?