KCR To Meet Uddhav: కేసీఆర్ కు ‘థాక్రే’ ఫోన్.. ముంబైలో భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోతున్నారా..? బీజేపీపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా..?
- By Balu J Published Date - 12:59 PM, Wed - 16 February 22
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోతున్నారా..? బీజేపీపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా..? దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకశక్తులు ఏకమవుతున్నారా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. ఢిల్లీ కోటలను బద్ధలుకొడుతాం అని తేల్చి చెప్పిన కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవేగౌడ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మద్దతు తెలిసిన విషయం తెలిసిందే. ఇక దేవేగౌడ అయితే ‘రావుగారూ.. మీ యుద్ధం గొప్పది. మేం మీకు మద్దతు ఇస్తున్నాం’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తాజాగా కేసీఆర్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నుంచి ఆహ్వానం అందింది.
ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబై కి రావాలని, తన ఆతిథ్యం అందుకోవాలని ఉద్ధవ్ ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసిఆర్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతును పలికారు. కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం.
ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం” అని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యం అందుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..”
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.