Teenmar mallanna : మేడ్చల్ `రెడ్డి` వార్ లో తీన్మార్ మల్లన్న
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar mallanna) కొత్త పార్టీని పెట్టారు.
- By CS Rao Published Date - 11:47 AM, Wed - 19 April 23
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar mallanna) కొత్త పార్టీని పెట్టారు. ఆ పార్టీ తరపున మేడ్చల్ (Medchal)నుంచి పోటీ చేయబోతున్నారు.తాజాగా జైలు నుంచి మంగళవారం బయటకు వచ్చిన ఆయన ప్రకటించారు. అక్కడ ఉండే మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య జరుగుతోన్న వార్ ను అనుకూలంగా మలుచుకోవడానికి మల్లన్న మాస్టర్ స్కెచ్ వేశారు.
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ(Teenmar mallanna)
మేడ్చల్ నియోకవర్గం (Medchal)ఉంచి గెలిచిన మల్లారెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఇటీవల బాగా హైలెట్ అయ్యారు. పాలు అమ్మా, కష్టపడ్డా, కాలేజిలు పెట్టా..అంటూ డైలాగులు చెబుతూ యువతను ఉత్సాహపరుస్తున్నారు. అసెంబ్లీ లోపల కూడా ఇదే డైలాగులు చెబుతూ హైలెట్ గా నిలుస్తున్నారు. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి వద్ద జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కూడా అదే డైలాగులతో ఉర్రూత లూగించారు. అదే సమయంలో నియోజకవర్గం అభివృద్ధి అంతా తానే చేశానని చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే మళ్లీ పోటీ చేస్తా అంటూ ప్రకటించారు. సరిగ్గా ఇక్కడే సుధీర్ రెడ్డికి మండింది.
మేడిపల్లి వద్ద బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మాట్లాడడానికి అవకాశం సుధీర్ రెడ్డికి వచ్చినప్పుడు మల్లారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. నియోజకవర్గం అభివృద్ధిని మల్లారెడ్డి ఒక్కడే చేయలేదని చెబుతూ తన హయాంలో జరిగిన పనుల గురించి తెలియచేసే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ఎలా చెబుతావు? అంటూ నిలదీశారు. దీంతో మల్లారెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సుధీర్ రెడ్డి చేతిలో ఉన్న మైకును లాగేసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయ సమ్మేళనం వేదికగా వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మేడ్చల్ (Medchal)కేంద్రంగా `రెడ్డి` సామాజికవర్గం నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
మల్లారెడ్డి కి ఉన్న సోషల్ మీడియా గ్లామర్
బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మేడ్చల్ కేంద్రంగా ఉన్న గ్యాప్ ను సానుకూలంగా మలుచుకోవడానికి తీన్మార్ మల్లన్న(Teenmar mallanna) ప్రయత్నం మొదలు పెట్టారు. తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మేడ్చల్ నుంచి పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించారు. అంతేకాదు, మరో పది చోట్ల తెలంగాణ నిర్మాణ పార్టీ తరపున పోటీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే కొత్త పార్టీని రిజిస్ట్రర్ చేసినట్టు ప్రకటించారు.
Also Read : Danam Nagendra : `దానం` దారెటు.! BRS కు గుడ్ బై నా?
తొలి నుంచి మల్లారెడ్డి మీద తీన్మార్ మల్లన్న (Teenmar mallanna)పలు ఆరోపణలు చేస్తుంటారు. ఆయన ఆస్తుల మీద పలుమార్లు చిట్టాను బయటకు తీశారు. కష్టపడి ఆస్తుల సంపాదించానని మల్లారెడ్డి తరచూ చెబుతుంటారు. కౌంటర్ గా తీన్మార్ మల్లన్న మాత్ర అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తుంటారు. వాళ్లిద్దరి మధ్యా తరచూ ఇలాంటి ఆరోపణలు , ప్రత్యారోపణలు సోషల్ మీడియా వేదికగా చూశాం. ఇప్పుడు డైరెక్ట్ గా మేడ్చల్ నుంచి మల్లన్న రంగంలోకి దిగుతున్నారు. ఇక మల్లారెడ్డి కి ఉన్న సోషల్ మీడియా గ్లామర్ ను మల్లన్న కడిగేయబోతున్నారన్నమాట.
Also Read : KTR Son Himanshu : గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తాత KCR ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షు..
Related News
Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్
తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది