HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Since When Bharat Rice Sales Will Be Started In Telangana State

Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?

Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.

  • Author : Pasha Date : 09-02-2024 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Rice Price
Bharat Rice Price

Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు. తెలంగాణను డెవలప్ చేస్తామని అంటున్న కేంద్ర సర్కారు భారత్ రైస్‌ను ఇంకా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ బియ్యం హైదరాబాద్‌లోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతామని తొలుత అధికారులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ రైస్(Bharat Rice) కోటాను కేటాయించలేదని, అందువల్లే రాష్ట్రంలో సప్లై మొదలుపెట్టలేదని నాఫెడ్ మేనేజర్ వినయ్ కుమార్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో నాన్ ఫోర్టిఫైడ్ రైస్ లేని కారణంగా బియ్యం కేటాయింపులు జరగలేదని అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్ నగరాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినా.. బియ్యం రాని కారణంగా భారత్ రైస్ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది.భారత్ రైస్ తెలుగు రాష్ట్రాలకు చేరకపోవడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం, తాత్సారం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ బ్రాండ్ బియ్యాన్ని ఈ కామర్స్ లో విక్రయిస్తామని కేంద్రం చెప్పినా అక్కడ కూడా అందుబాటులో లేవు. కారణాలు ఏవైనా రాయితీ బియ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభించక పోవడంపై పలువురు ఆహార సలహా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ‘భారత్ రైస్’ పేరిట పథకాన్ని కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా ప్రారంభించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ బియ్యాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాయితీ భారత్ రైస్ విక్రయించకున్నా ఆయా రాష్ట్రాల పౌర సరఫరాలశాఖ అధికారులు, మంత్రులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ రైస్ విక్రయానికి తెర లేపిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Also Read : Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో బ్యాన్.. ఎందుకు ?

ప్రస్తుతానికి తెలంగాణలోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ఔట్ లెట్లలో గోధుమపిండి, శనగపప్పులను మాత్రమే అమ్ముతున్నారు. కిలో శనగపప్పు రూ. 60, కిలో గోధుమ పిండి రూ. 27.50 చొప్పున సేల్ చేస్తున్నారు. ఐదు కిలోల శనగపప్పు, గోధుమపిండి  బ్యాగులను విక్రయిస్తున్నారు. భారత్ రైస్‌ ఐదు కిలోలు, పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దీని సేల్స్ మొదలయ్యాయి. అయినా నేటికీ తెలంగాణకు ఆ బియ్యాన్ని కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bharat Rice
  • telangana

Related News

Huge Demand for Goats and Chickens at Medaram

మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

Medaram Jatara  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • Medaram Sammakka Saralamma Maha jatara begins

    వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Municipal Elections In Tela

    తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd