HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Since When Bharat Rice Sales Will Be Started In Telangana State

Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?

Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.

  • By Pasha Published Date - 10:38 AM, Fri - 9 February 24
  • daily-hunt
Bharat Rice Price
Bharat Rice Price

Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు. తెలంగాణను డెవలప్ చేస్తామని అంటున్న కేంద్ర సర్కారు భారత్ రైస్‌ను ఇంకా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ బియ్యం హైదరాబాద్‌లోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతామని తొలుత అధికారులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ రైస్(Bharat Rice) కోటాను కేటాయించలేదని, అందువల్లే రాష్ట్రంలో సప్లై మొదలుపెట్టలేదని నాఫెడ్ మేనేజర్ వినయ్ కుమార్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో నాన్ ఫోర్టిఫైడ్ రైస్ లేని కారణంగా బియ్యం కేటాయింపులు జరగలేదని అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్ నగరాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినా.. బియ్యం రాని కారణంగా భారత్ రైస్ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది.భారత్ రైస్ తెలుగు రాష్ట్రాలకు చేరకపోవడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం, తాత్సారం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ బ్రాండ్ బియ్యాన్ని ఈ కామర్స్ లో విక్రయిస్తామని కేంద్రం చెప్పినా అక్కడ కూడా అందుబాటులో లేవు. కారణాలు ఏవైనా రాయితీ బియ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభించక పోవడంపై పలువురు ఆహార సలహా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ‘భారత్ రైస్’ పేరిట పథకాన్ని కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా ప్రారంభించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ బియ్యాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాయితీ భారత్ రైస్ విక్రయించకున్నా ఆయా రాష్ట్రాల పౌర సరఫరాలశాఖ అధికారులు, మంత్రులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ రైస్ విక్రయానికి తెర లేపిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Also Read : Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో బ్యాన్.. ఎందుకు ?

ప్రస్తుతానికి తెలంగాణలోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ఔట్ లెట్లలో గోధుమపిండి, శనగపప్పులను మాత్రమే అమ్ముతున్నారు. కిలో శనగపప్పు రూ. 60, కిలో గోధుమ పిండి రూ. 27.50 చొప్పున సేల్ చేస్తున్నారు. ఐదు కిలోల శనగపప్పు, గోధుమపిండి  బ్యాగులను విక్రయిస్తున్నారు. భారత్ రైస్‌ ఐదు కిలోలు, పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దీని సేల్స్ మొదలయ్యాయి. అయినా నేటికీ తెలంగాణకు ఆ బియ్యాన్ని కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bharat Rice
  • telangana

Related News

Private Colleges

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd