YS Sharmila : తెలంగాణ సర్కార్ పై షర్మిల ఫైర్….ఇద్దరూ తోడుదొంగలేనా..?
తెలంగాణ సర్కార్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టిన మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు.
- By hashtagu Published Date - 02:58 PM, Sat - 23 July 22

తెలంగాణ సర్కార్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టిన మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. మా తెలంగాణ వాళ్లకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా …లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవడం కోసమా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
మెగా కృష్ణారెడ్డి రూ. 70వేల కోట్ల అవినీతికి పాల్పపడ్డారని..బ్లాక్ మనీ ఉందని దీనికి సంబంధించి 12వేల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉందని జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెబుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మీరు ఇద్దరూ తోడుదొంగలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు…అందుకే మీ ముడుపులు మీకు అందుతున్నాయి. కాబట్టి మాట్లాడటం లేదు. అంటూ షర్మిలా ప్రశ్నించారు.