Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!
అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా ఓ పబ్ రూల్స్ విధిస్తోంది.
- By Balu J Published Date - 10:51 AM, Mon - 27 March 23
నిత్యం ఉరుకుల పరుగులు.. ఉద్యోగ బాధ్యతలు ఒకవైపు, మరోవైపు టార్గెట్ ఒత్తిళ్లతో సతమతమయ్యే టెకీలు, యూత్, బీకెట్ స్టూడెంట్స్ వీకెండ్స్ లో కాస్తా రిలాక్స్ కావాలనుకోవడం సహజమే. అయితే వీటినే క్యాష్ చేసుకుంటున్నాయి హైదరాబాద్ లోని పబ్స్. యువత అవసరాలను గ్రహించి అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని పబ్స్ అయితే ఇందుకోసం కండీషన్స్ కూడా పెడుతున్నాయి. అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా రూల్స్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలకు ప్రవేశం కల్పించడం లేదు. అయితే కొన్ని పబ్స్ ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేస్తూ, అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్ ఆఫర్ చేస్తూ డబ్బులను దండుకుంటున్నాయి. అంతేకాదు.. అమ్మాయిలతో రొమాన్స్ చేసేందుకు పబ్బుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తే రొమాన్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
పబ్స్ పై పోలీసుల రైడింగ్
తాజాగా సికింద్రబాద్ పరిధిలోని పలు పబ్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగతున్నాయనే సమాచారం అందడంతో సికింద్రాబాద్ పోలీసులు, ఇతర పోలీసు అధికారులు జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాణిగంజ్ పరిధిలోని ఓ పబ్ అబ్బాయిల తోడు కోసం అమ్మాయిలను ఆఫర్ చేస్తున్నాయి. అబ్బాయిలు కొంతమొత్తంలో డబ్బు చెల్లిస్తే.. అమ్మాయితో పబ్ లో గడపవచ్చు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే పబుల్లో ప్రత్యేక రూమ్స్ ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాంటి రూమ్స్ లో అమ్మాయిలతో అబ్బాయిలు ఏకాంతంగా గడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు 20 అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇలాంటి పబ్స్ పై పోలీసులు ద్రుష్టి సారిస్తున్నారు.
Tags
Related News
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎ