HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Uttam Dont Know The Value Of Water Harish

Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్

Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.

  • Author : Sudheer Date : 17-08-2025 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao Water
Harishrao Water

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నీళ్ల విలువ తెలియదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం రైతులను బలి చేయవద్దని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ వాటికి నష్టం కలిగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇలా చేస్తే మోటార్లు పాడైపోతాయని, వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని బీహెచ్ఈఎల్ కూడా హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. మోటార్లు దెబ్బతింటే దానిని బీఆర్ఎస్ పార్టీపై నెట్టాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పాడుపెట్టిందని, ఇప్పటికైనా బురద రాజకీయాలు మానేసి వరద నీటిని ఒడిసి పట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Surrogacy Case : మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు

రైతు ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని హరీశ్‌రావు విమర్శించారు. కమీషన్లకు, వాటాలకు సమయం సరిపోతోందని, ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. నంది మేడారంలో స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీరు మిడ్ మానేరులోకి వస్తుందని, ఈ విషయాన్ని వారం క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేశానని హరీశ్‌రావు తెలిపారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లు తెరిచి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు కాబట్టి ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టి రైతులకు అందించారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యవసాయం చేయలేదు కాబట్టి వారికి నేల విలువ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా కూడా కళ్లప్పగించి చూడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • harish rao
  • Kaleshwaram water
  • Value of Water

Related News

Ktr Manuu

బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

HYD గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి చెందిన 50ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం నోటీసులివ్వడంపై ప్రతిపక్షాలు, విద్యార్థులు మండిపడుతున్నారు

  • Ktr Comments Revanth

    నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

  • Musi River

    Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

  • Kavithavsbrs

    కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?

  • Peples Support Kavitha

    కవిత కు మీమున్నాం అంటున్న ప్రజలు

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd