HCA : హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో అవకతవకలపై సుప్రీంకు చేరిని నివేదిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ)ని పర్యవేక్షించడానికి భారత సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ తన
- By Prasad Published Date - 07:59 AM, Wed - 1 February 23
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ)ని పర్యవేక్షించడానికి భారత సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ తన తాజా ఫలితాలను మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. హెచ్సీఏ సభ్యత్వాలపై విస్మయకర వాస్తవాలను ఈ నివేదిక వెల్లడించింది. సభ్యత్వాల నమోదు వివరాలను ఎక్కడా రికార్డు చేయలేదని నివేదికలో పేర్కొంది. 2019లో హెచ్సీఏ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి ఎలా రూపొందించారనే దానిపై ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవని నివేదిక పేర్కొంది.కొంతమంది HCA సభ్యులు 7-8 క్లబ్లను కలిగి ఉన్నారని తెలిపింది. రాష్ట్ర జట్టు ఎంపిక విధానం, జట్ల కొనుగోలు, అమ్మకంలో ఉప చట్టాలలో పొందుపరచబడిన జస్టిస్ లోధా కమిటీ సంస్కరణలు అందించిన అన్ని సంస్థాగత ప్రక్రియలను సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తారని నివేదిక పేర్కొంది. HCA సభ్యత్వాలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలకు సమాన సభ్యత్వ హక్కులను అందించాలనే ఉద్దేశ్యం లేదని.. 35 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న వందలాది క్లబ్బులు కూడా అదృశ్యమయ్యాయని నివేదిక వెల్లడించింది.. ఈ క్లబ్బులు ఎలా అదృశ్యమయ్యాయో, వాటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారో ఎలాంటి రికార్డులు లేవని నివేదిక పేర్కొంది. సభ్యత్వ మోసాలు 90ల నుండి ఉన్నాయని.. కాలక్రమేణా పెరిగాయని తెలిపింది.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.