CM KCR: మత గురువులకు రాజకీయాలతో సంబంధం ఏంటి?
నేటి రాజకీయాలు కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మత గురువుల ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 03:42 PM, Fri - 16 June 23
CM KCR: నేటి రాజకీయాలు కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మత గురువుల ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది. మత గురువులు రాజకీయ నేతలతో దోస్తీ కడుతున్నారు. రాజకీయ అండదండలు ఉంటే ఎలాంటి కార్యకలాపాలు అయినా చేయొచ్చని దురుద్దేశంతో కొందరు మత గురువులు చెలరేగిపోతున్నారు. తాజాగా మత గురువుల రాజకీయ రంగ ప్రవేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘాటుగా స్పందించారు.
మత పెద్దలు రాజకీయాల్లోకి చొరబడకుండా మఠాలకే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయాలలో మతపరమైన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంది పడ్డారు. నాగ్పూర్లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మత పెద్దలు మఠాలు నడపాలి, పూజలు చేయాలి. యజ్ఞాలు చేయాలి. రాజకీయాల్లోకి చొరబడి దేశంలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. దేశంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నామని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా మార్పు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ అన్నారు. ఇదిలావుండగా బీజేపీపై సీఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కెసిఆర్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను ఈ విధంగా ఇరుకున పెట్టడం సరికాదని సూచించారు.
Read More: Basara IIIT : త్రిపుల్ ఐటీ వార్, ప్రభుత్వానికి గవర్నర్ 48 గంటల డెడ్ లైన్
Related News
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.