Kothagudem: మావోయిస్టు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్.. “ఆపరేషన్ చేయూత” ద్వారా సాయం
- By Balu J Published Date - 06:58 PM, Fri - 12 April 24
Kothagudem: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని తమ ఉనికి కోసం,స్వార్ధ ప్రయోజనాల కోసం వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహారిస్తున్నారని అన్నారు.చిన్న చిన్న సమస్యలు,కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసీ తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలామంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు.వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసు వారు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు.జిల్లా నుండి నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
నలుగురు దళ సభ్యుల లొంగుబాటు
1).చర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవా, 2).కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్@రంజిత్, 3). చతిస్గడ్ సుకుమా జిల్లాకు, జేగురుగొండ మండలం తిమ్మాపూర్ కు చెందిన సోడి గంగా@అశోక్ మరియు 4).సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మ దేవే లు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక,మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వేధింపులు తట్టుకోలేక ఈరోజు పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు.
Tags
Related News
Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు.