TS : కేటీఆర్ పై పీడీ యాక్ట్ విధించాలి-ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య డిమాండ్..!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై...గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- By hashtagu Published Date - 04:29 AM, Sat - 15 October 22
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై…గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ పై పీడీ యాక్ట్ విధించాలంటూ ఉషాబాయి డిమాండ్ చేవారు. ఎఐఎంను బుజ్జగించేందుకు, ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో రాజాసింగ్ ను జైల్లో పెట్టారని ఆరోపించారు. స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీని హైదరాబాద్ ను ఆహ్వానించి శిల్పకళావేదికలో షో నిర్వహించినందుకు ..మంత్రి కేటీఆర్ పై పీడీయాక్ట్ ప్రయోగించాలని రాజాసింగ్ భార్య డిమాండ్ చేశారు.
ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే రాజాసింగ్ ను జైల్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్ కు భయం మొదలయ్యిందన్నారు. ఈ భయంతోనే కేసీఆర్ తన కొడుకు, ఓవైసీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూత్వం గురించి మాట్లాడుతున్న రాజాసింగ్ ను తెలంగాణ హిందూవులు ఆయన్ను అనుసరిస్తున్నారు. హిందూవులను కించపరిచే లక్ష్యంతోనే ఈ కుట్ర జరిగింది. అందుకే రాజాసింగ్ ను జైల్లో పెట్టారన్నారన్నారు.
బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది