HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Orr Issue Congress Leader Judson Complained To Ed About Orr Tender Irregularities

ORR Issue : EDకి ఔట‌ర్ ఇష్యూ, కాంగ్రెస్ నేత జ‌డ్స‌న్ ఫిర్యాదు

తెలంగాణ ప్ర‌భుత్వ (ORR Issue) అక్ర‌మాల‌పై బ‌క్కా జ‌డ్స‌న్ (Jadson)విసిగిపోయి బ‌ట్ట‌లు చింపుకుని ఈడీ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న తెలిపారు.

  • By CS Rao Published Date - 06:11 PM, Wed - 3 May 23
  • daily-hunt
Orr Issue
Orr Issue

తెలంగాణ ప్ర‌భుత్వ (ORR Issue) అక్ర‌మాల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఫిర్యాదులు చేసిన బ‌క్కా జ‌డ్స‌న్ (Jadson)విసిగిపోయి బ‌ట్ట‌లు చింపుకుని ఈడీ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న తెలిపారు. ఆర్థికంగా తెలంగాణ స‌మాజాన్ని న‌ష్ట‌ప‌రిచేలా ఉన్న అంశాల‌ను ఆధారాల‌తో ఇచ్చిన‌ప్ప‌టికీ ఈడీ స్పందించ‌డంలేద‌ని నిర‌సన వ్య‌క్త‌పరిచారు. తాజాగా ఔట‌ర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ లో జ‌రిగిన భారీ స్కామ్ మీద నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఈడీ తీరుపై ఫైర్ అవుతూ ఫిర్యాదు అందించారు. ఇప్ప‌టికే కల్ల‌కుంట్ల కుటుంబం అక్ర‌మాలు, అవినీతిపై ప‌లు ఫిర్యాదులు చేసిన జ‌డ్స‌న్ బుధ‌వారం ఈడీ కార్యాల‌యం ఎదుట గాంధేయ‌మార్గంలో నిర‌స‌న తెలిపారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ లో జ‌రిగిన భారీ స్కామ్(ORR Issue)

తెలంగాణ సర్కారు ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం ఔట‌ర్ కాంట్రాక్ట్ (ORR Issue) విష‌యంలో జ‌రిగింద‌ని జ‌డ్స‌న్ ఆరోప‌ణ‌. మహారాష్ట్రలో 1,014 లేన్​ కి.మీ.లు రోడ్డును 10 ఏండ్లు.. రూ.8,875 కోట్లు – తెలంగాణలో 1,264 లేన్​ కి.మీ.లు.. 30 ఏండ్లు.. రూ.7,380 కోట్లు అని ఈడీ కి ఫిర్యాదు చేశారు. తెలంగాణను ఆర్థికంగా ముంచేలా కెసిఆర్ ఉన్నార‌ని ఈడీ కార్యాలయం ముందు బట్టలు చింపుకుని జ‌డ్స‌న్(కాంగ్రెస్ యావ‌రేజ్ లీడ‌ర్)(Jadson) నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్న ప్ర‌కారం…

ఔటర్ రింగ్ రోడ్డు (ORR Issue) టెండర్‌‌ను తక్కువ మొత్తానికే కట్టబెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో సగానికి సగం తగ్గుతున్నా ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో తక్కువ దూరం, తక్కువ కాలానికి ఎక్కువ మొత్తం చెల్లించి లీజ్ దక్కించుకున్న ఐఆర్‌‌బీ కంపెనీకి.. హైద‌రాబాద్‌ ఓఆర్ఆర్ ఎక్కువ దూరం ఉన్నా, ఎక్కువ కాలానికి.. తక్కువ మొత్తానికే రాష్ట్ర సర్కారు అప్పగించేసింది. దీని వెనుక భారీ గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుట్టుచప్పుడు కాకుండా ఓఆర్ఆర్(ORR Issue)

టెండర్ల విషయంలోనూ గోప్యతను పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ (టీవోటీ) అగ్రిమెంట్‌‌‌‌లో పేర్కొన్న అంశాలేవి? కేవలం టోల్ మాత్రమేనా? టోల్ పాయింట్లు, జంక్షన్ల దగ్గర ఉన్న ఓఆర్ఆర్ భూములు (ORR Issue) కూడా రాసిచ్చారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఓఆర్ఆర్ టోల్‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్లకు ముంబై కంపెనీ ఐఆర్‌‌‌‌బీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఖజానా నింపేందుకే ఓఆర్ఆర్ టోలింగ్ అప్పగించినట్లు సర్కారు చెబుతోంది. మొన్నటిదాకా ఐదేండ్లకే రూ.4 వేల కోట్ల రాబడి వస్తుందని కేబినెట్ సబ్ కమిటీ పలు దఫాలుగా జరిపిన మీటింగుల్లో చర్చించింది. కానీ ఇప్పుడేమో 30 ఏండ్లకు కలిపి కేవలం రూ.7,380 కోట్లకే అగ్రిమెంట్ కుదుర్చుకుంది. బీఆర్ఎస్ లీడర్ల కోసం మెట్రో రూట్ మార్చినట్లు ఇక్కడ కూడా పెద్దల కోసమే తగ్గించారా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ హంగామా చేస్తూ.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఓఆర్ఆర్(ORR Issue) పనికానిచ్చేసింది.

మహారాష్ట్ర కంటే దాదాపు రూ.1,500 కోట్లు తగ్గుతున్నది

మహారాష్ట్రలోని ముంబై పుణె ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే ప్రాజెక్టు, ముంబై–పుణే నేషనల్ హైవే –4 టోలింగ్‌‌‌‌తోపాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్ కోసం ఐఆర్‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ 2020లో టెండర్ దక్కించుకున్నది. పదేళ్ల కాలపరిమితికి అంటే 2030 వరకు టీఓటీ చేపట్టనుంది. దీని పరిధి 1,014 లేన్ కిలోమీటర్లుగా ఉన్నది. ఇందుకోసం మహారాష్ట్ర స్టేట్ రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ)కి ఏకంగా రూ.8,875 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో రూ.6,610 కోట్లు ఏక మొత్తంలో మొదటి ఏడాదే చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని వరుసగా మూడేండ్లలో కొంత మొత్తం చొప్పున పూర్తిస్థాయిలో చెల్లిస్తున్నది. అదే తెలంగాణలోని నెహ్రూ ఔటర్​ రింగ్ రోడ్డు 1,264 లేన్ కిలోమీటర్లు ఉంది. మహారాష్ట్ర–పుణే ఎక్స్​ప్రెస్ వే కంటే 250 కిలోమీటర్లు ఎక్కువ. ఇక కాలపరిమితి కూడా మహారాష్ట్ర కంటే 20 ఏండ్లు అధికం. అదే తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌కు చెల్లించేది మాత్రం రూ.7,380 కోట్లు మాత్రమే. అమౌంట్ విషయంలోనూ మహారాష్ట్ర కంటే దాదాపు రూ.1,500 కోట్లు తగ్గుతున్నది.

అన్నింటినీ ఊడ్చేస్తున్న రాష్ట్ర సర్కార్

ఓఆర్ఆర్ టోల్ (ORR Issue) దగ్గర, సైడ్ పాస్​ల దగ్గర, జంక్షన్ల దగ్గర కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో ఎమినిటిస్ క్రియేట్ చేయాలని తొలుత భావించారు. ‘వే టు ఎమినిటిస్’ పేరుతో గతంలో టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదు. ఇప్పుడు టెండర్ వివరాలు, అగ్రిమెంట్‌‌‌‌కు సంబంధించిన విషయాలను ప్రభుత్వం పూర్తిగా వెల్లడించకపోవడంతో ఈ భూములు కూడా ఐఆర్​బీ చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఆదాయం పేరిట ఆస్తులతో పాటు భూములన్నింటినీ రాష్ట్ర సర్కార్ ఊడ్చేస్తోంది. ఒక్కొక్కటిగా వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ వస్తోంది. లీజుల పేరుతో, కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయంటూ వేలకొద్దీ ఎకరాలు తక్కువ మొత్తానికే ఇచ్చేస్తోంది. ఒక్క గుంట కూడా ప్రభుత్వం పేరిట మిగలకుండా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 58, 59 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పేరుతో పేదలు ఎంత లబ్ధిపొందుతున్నారో దేవుడెరుగు.. కానీ ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. సర్కార్ భూములు కబ్జా చేసి కాలేజీలు, లే అవుట్లు చేసి నిర్మాణాలు, హాస్పిటల్స్ కట్టి ఇప్పుడు రెగ్యులరైజేషన్ కింద మేలు పొందుతున్నారు. బీఆర్ఎస్ లీడర్ల భూముల కోసమే ఫలక్​నామా నుంచి కాకుండా రాయదుర్గం నుంచి ఎయిర్​పోర్ట్ మెట్రోకు సర్కారు శంకుస్థాపన చేసిందనే విమర్శలు ఉన్నాయి.

Also Read : Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?

 రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ను(ORR Issue) ఏకంగా 30 ఏండ్ల కాలపరిమితి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందనే దానిపై ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఐదేండ్లు, 10 ఏండ్లు అనుకున్నామని.. కేబినెట్ సబ్ కమిటీ భేటీల్లోనూ అదే చర్చ జరిపామని చెబుతున్నారు. కానీ అనుహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 20 ఏండ్లు ఎక్కువ ఇవ్వడం ఏంటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. వాస్తవానికి ఓఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులను 10 ఏండ్లలోపే టీఓటీకి ఇస్తేనే రాష్ట్ర సర్కార్​కు మేలుగా ఉంటుంది. ఆ పదేండ్లలో వచ్చిన మార్పులు, పెరిగిన ధరలు, వాహనాల రద్దీకి అనుగుణంగా ఇంకోసారి టెండర్ పిలిస్తే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసుకునేందుకు వీలుంటుంది. ఇప్పటిదాకా నిర్వహిస్తూ వచ్చిన ఏజెన్సీలకు రెండేళ్ల కాలపరిమితితోనే ఇచ్చారు. వచ్చే ప్రభుత్వాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఇప్పుడున్న వారికే మేలు జరిగేలా పెద్దల హస్తం ఉందనేది బలంగా వినిపిస్తోంది.

గత ఏడాది 414 కోట్లు.. ఇకపై వచ్చేది 248 కోట్లే

టోల్ వసూలును ఏదో ఒక ఏజెన్సీకి కొంతకాలానికి అప్పగిస్తూ రాష్ట్ర సర్కారే ఓఆర్ఆర్‌‌ (ORR Issue) నిర్వహణ చూస్తోంది. గతేడాది టోల్​తో సర్కార్​కు రూ.414 కోట్లు వచ్చింది. ఈసారి రూ.500 కోట్లు వస్తుందని అంచనా. ఇలా ఏటా ఈ మొత్తం అంతకంతకు పెరగనుంది. వెహికల్స్​రద్దీ, టోల్ ధర క్రమంగా పెరుగుతుంది. దీంతో 30 ఏండ్లలో దాదాపు రూ.15 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందని అంచనా. ఐఆర్‌‌బీకి అప్పగించిన దాని ప్రకారం ఇప్పుడు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది కేవలం రూ.248 కోట్లు మాత్రమే. ఇంత తక్కువకు ఓఆర్‌‌ఆర్‌‌ను కట్టబెట్టడంపై ప్రభుత్వ పెద్దలు మౌనం వీడటం లేదు. ఆదాయం కోసమే టీఓటీకి ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా టెండర్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారనే ప్రశ్నలకు సర్కార్ నుంచి సమాధానం రావడం లేదు. టెండర్ను వెంటనే రద్దు చెయ్యాలి. అంటూ టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబు క‌లిసి బ‌క్కా జ‌డ్స‌న్ (Jadson)ఈడీకి ఫిర్యాదు చేశారు.

Also Read : KTR Counter: అమిత్‌షాకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AskKTR
  • bakka judson
  • Outer Ring Road
  • Outer Ring Road of 158 km

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd