HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >No Allocation To Telangana In Union Budget 2024 Says Ktr

Union Budget 2024-25 : తెలంగాణకు మరోసారి కేంద్రం ‘0’ బడ్జెట్ – కేటీఆర్

16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి

  • Author : Sudheer Date : 23-07-2024 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Budget2025
Ktr Budget2025

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టగా..ఈ బడ్జెట్ ఫై తెలంగాణ ప్రజలు , పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తెలంగాణ (Telangana) ప్రజలకు కేంద్రం మొండిచేయి చూపించిందని మండిపడుతున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ప్రకటించిన బడ్జెట్ 2024-25లో (Union Budget) తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. కానీ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసేఎత్తకపోవడం ఫై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు భారీగా ఓట్లేసి గెలిపించిన సంగతి తెలిసిందే. ఈసారి నార్త్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గినా తెలంగాణలో అధికార కాంగ్రెస్తో సమానంగా ఆ పార్టీకి 8 సీట్లు కట్టబెట్టారు. దీంతో ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు వస్తాయని అంతా అంచనా వేశారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తకపోవడం ఫై తెలంగాణ అంటే బిజెపికి ఎంత ప్రేమ ఉందొ అర్ధం అవుతుందని వాపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చెయ్యి ఇచ్చాయని బిఆర్ఎస్ విమర్శించింది. ‘కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కెసిఆర్ ఎప్పుడూ చెప్పేవారు. 16 మంది ఎంపీలతో టీడీపీ, 12 మంది ఎంపీలతో JDU భారీగా కేటాయింపులు సాధించాయి. తెలంగాణ సొంత పార్టీకి 12-15 మంది ఎంపీలు ఉండుంటే ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు వచ్చుండేవి’ అని ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు ఈసారి కూడా అదేచేసారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బ‌డ్జెట్ తెలియజేస్తోంద‌న్నారు.

8 కాంగ్రెస్ ఎంపీలు + 8 బీజేపీ ఎంపీలు = 0 (తెలంగాణకు దక్కింది) pic.twitter.com/iz7oxvAM9W

— BRS Party (@BRSparty) July 23, 2024

కేంద్ర బడ్జెట్‌ పైన స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏼

🔸తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం.

🔸రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని… pic.twitter.com/aFTTb4dP0u

— BRS Party (@BRSparty) July 23, 2024

Read Also ;


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • ktr
  • No Allocation
  • telangana
  • Union Budget 2024-25

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd