Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
- Author : Sudheer
Date : 10-11-2025 - 1:49 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రజల్లో స్పష్టమైన నమ్మకం ఏర్పడిందని ఉత్తమ్ తెలిపారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి, మహిళా శక్తి పథకం, చెరువు పునరుద్ధరణ, విద్యుత్ సంస్కరణలు వంటి పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని ఆయన అన్నారు.
Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం
గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తీవ్రంగా విమర్శించారు. “గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. పేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలు పట్టించుకోలేదు. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ నేతలు కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చారు” అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్లో పునరుద్ధరణ కాలం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. “నవీన్ యువ నాయకుడు, ప్రజల మధ్య ఎప్పుడూ ఉంటాడు. ఆయన గెలిస్తే ఇక్కడి రహదారులు, మౌలిక వసతులు, విద్యా సంస్థలు అన్నీ కొత్త రూపు దాలుస్తాయి” అని చెప్పారు.
జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. “ప్రజలు ఈసారి అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారికీ భవిష్యత్తును మార్చే నాయకత్వం కావాలి. నవీన్ యాదవ్ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పథకాలతో జూబ్లీహిల్స్ను మోడల్ నియోజకవర్గంగా మార్చుతుంది,” అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ, నిర్లక్ష్యం వల్ల విసిగిపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోతున్నారని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ప్రజలు రేవంత్ నాయకత్వానికి తమ మద్దతు పునరుద్ధరించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.