HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Munugode Defeat A Blow To Bjps Telangana Plans

BJP in Dilemma: మునుగోడులో ఓటమి.. బీజేపీకి గట్టి దెబ్బ!

మునుగోడులో హుజూరాబాద్ విజయాన్ని పునరావృతం చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టి

  • By hashtagu Published Date - 05:15 PM, Mon - 7 November 22
  • daily-hunt
Bjp
Bjp

మునుగోడులో హుజూరాబాద్ విజయాన్ని పునరావృతం చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఉన్న ప్రజాభిమానంతో మునుగోడులో హ్యాట్రిక్‌ విజయాలు సాధించాలనుకుంది బీజేపీ. రాజగోపాల్ రెడ్డిని బిజెపిలోకి స్వాగతించి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మునుగోడును సందర్శించి, ఆయనను గెలిపించాలని మునుగోడు ప్రజలను సైతం కోరారు. రాజగోపాల్ గెలిచిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని కూడా షా జోస్యం చెప్పారు.

గతేడాది హుజూరాబాద్‌లోనూ ఇదే వ్యూహం ఫలించడంతో బీజేపీ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. సీనియర్ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేందర్‌కు ఇది వ్యక్తిగత విజయం. నియోజకవర్గంలో తనకున్న ప్రజాభిమానాన్ని క్యాష్ చేసుకున్న రాజేందర్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌కు సవాలు విసిరే శక్తివంతమైన రాజకీయ శక్తిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి బీజేపీ ఈ విజయాన్ని ఉపయోగించుకుంది. దుబ్బాకలో జరిగిన తొలి ఉపఎన్నికలో టీఆర్ఎస్ పై బీజేపీ స్వల్ప ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో బీజేపీ తెలంగాణలోనూ పాగా వేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. దీని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (జీహెచ్‌ఎంసీ) బీజేపీ టీఆర్ఎస్ సమానంగా కార్పొరేటర్లను గెలుపించుకుంది. 48 స్థానాలు గెలుచుకొని దూకుడుగా వ్యవహరించింది.

2018 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కేవలం తొమ్మిది నియోజకవర్గాల్లోనే రెండో స్థానంలో నిలవగా, చాలా స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ పార్టీ సికింద్రాబాద్‌ను నిలుపుకోవడమే కాకుండా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో మరో మూడు స్థానాలను కైవసం చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బీజేపీ పార్టీ తమకు తిరుగు లేదని భావించింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ‘మిషన్ 2023’తో మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని నిర్వహించింది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా అగ్రనేతల వరుస పర్యటనలతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.

రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, మునుగోడులో ఉప ఎన్నిక విధించడం ఈ వ్యూహంలో భాగమే. అయితే హుజూరాబాద్‌ను పునరావృతం కాకుండా చూసేందుకు టీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డింది. రాజగోపాల్ రెడ్డి కేంద్రం నుండి రూ.18,000 కోట్ల కాంట్రాక్టును పొందిందని టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆరోపించడం కూడా మునుగోడులో మైనస్ గా మారింది. 500 కోట్లు ఖర్చు చేసి ఉప ఎన్నికల్లో గెలుస్తానని అమిత్ షాకు రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఇష్యూ కూడా బీజీపీకి తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ నేతల డ్రామాలతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. మునుగోడులో ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలను దింపి విజయంలో సాధించింది టీఆర్ఎస్. ఈ ఉప ఎన్నికతో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ గట్టి షాక్ తగిలినట్టయింది. ప్రస్తుత తాజా పరిస్థితుల కారణంగా తెలంగాణ బీజేపీ ఏంచేయబోతోంది? ఎలా వ్యవహరిస్తోంది? అనేది వేచి చూడాల్సిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Telangana
  • Munugode
  • Rajagopal Reddy
  • shocking

Related News

Sip

SIP : సిప్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి షాకింగ్..మీ డబ్బు సేఫేనా?

SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న.స్టాక్ మార్కెట్‌తో దీనికి సంబంధం ఉన్నప్పటికీ, అది నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినంత ప్రమాదకరం కాదు.

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd