Mother-Son Suicide: ‘రామాయంపేట ఘటన’లో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్!
కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఆరోపణలపై టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు అరెస్టు అయ్యారు.
- By Balu J Published Date - 12:45 PM, Wed - 20 April 22
కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఆరోపణలపై తెలంగాణ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి చెందిన ఆరుగురు నాయకులను మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏప్రిల్ 16న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో గంగం సంతోష్, అతని తల్లి గంగమ్మలు నిప్పంటించుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియా లోనూ వైరల్ అయ్యింది.
ఘటనకు కారణమైన రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ పల్లె జితేందర్ గౌడ్, మరో ఐదుగురు టిఆర్ఎస్ నాయకులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డితో సహా ఏడుగురి పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నాయకుల వల్లే ఆర్థికంగా నష్టపోయామని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి కారకులైనవారిని అరెస్ట్ చేశారు.
Related News
Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత
Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండ�