HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modi Raises Ap Bifurcation Issue In Parliament Again

Modi Bifurcation: విభజన గాయాన్ని రేపిన మోడీ!

సున్నితమైన ఏపీ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రధాని మోడీ రాజ్యసభలో గెలికాడు. ఆనాడు కాంగ్రెస్ ఆశాస్త్రీయంగా విభజన చేసిందని గత కొంత కాలంగా తెలుగుదేశం చెబుతున్న మాటలను మోడీ వినిపించాడు.

  • Author : CS Rao Date : 08-02-2022 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

సున్నితమైన ఏపీ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రధాని మోడీ రాజ్యసభలో గెలికాడు. ఆనాడు కాంగ్రెస్ ఆశాస్త్రీయంగా విభజన చేసిందని గత కొంత కాలంగా తెలుగుదేశం చెబుతున్న మాటలను మోడీ వినిపించాడు. రాబోయే రోజుల్లో టీడీపీ తో పొత్తు కు అనుకూలంగా ఉండేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీ ప్రజల మనోభావాని ప్రధాని పార్లమెంట్ వేదికగా చెప్పాడు. ఆ మాటలను టీడీపీ ఆహ్వానిస్తూ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది. ఇప్పడు మోడీ చేసిన ఆ కామెంట్స్ దూకుడు గా ఉన్న తెలంగాణ బీజేపీ ని కార్నర్ చేయడానికి ప్రత్యర్ధులు అనుకూలంగామలచుకుంటున్నారు.

పార్లమెంట్ లో ప్రధాని మోడీ తెలంగాణ విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోడీ ఏమేమో మాట్లాడుతున్నారని చురకలు వేశాడు. తెలంగాణ విభజన జరిగి ఏడేళ్లు అయినా విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ప్రధాని మోడీ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.తెలంగాణపై మొదట్నుంచి బీజేపీకి ప్రేమ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్‌, బీజేపీ కారణం కాదా? అని ప్రశ్నించారు హరీశ్ రావు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే అంత మంది చనిపోయేవారా? అని ఆవేదన వ్యక్తంచేస్తు నిలదీశారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం ఇవేమీ పట్టవని ఇపప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు అని మండిపడ్డారు. ఉత్తర భారతానికి ఒకనీతి, దక్షిణ భారతానికి ఒక నీతా?మోదీ ఉత్తరభారతానికి మాత్రమే ప్రధానా? అని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్యసభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ విమర్శించారు. తెలంగాణ‌కు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ అధికార గర్వం వ‌ల్ల ఏపీ-తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కుంటున్నాయని అన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సామరస్య పద్దతిలో జరగాల్సి ఉండేదని అన్నారు. విభజన చేసిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిందని, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను నమ్మలేదని అన్నారు. అందుకే రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మోదీ ప్రసంగించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ‘‘మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారు.

పార్లమెంటులో కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే వాడారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనం. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేసింది. ఏపీని కాంగ్రెస్‌ విభజించిన తీరు సరికాదు’’ అని మోదీ విమర్శించారు.దీంతో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం తెలుపుతూ తెలంగాణ వ్యాప్తంగా దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పిలుపు రేవంత్ పిలుపు ఇచ్చాడు. మొత్తం మీద మోడీ పార్లమెంట్లో చేసిన కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కి అస్త్రంగా మారింది. ఏపీలో టీడీపీ తో పొత్తు దిశగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ మోడీ వ్యాఖ్యల దుమారం రేగుతోంది. మరోసారి కేసీఆర్ కు సెంటిమెంట్ కలసి వచ్చేలా మోడీ కామెంట్స్ ఉన్నాయని అర్థం అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bifurcation issue
  • cm kcr
  • Modi government
  • revanth reddy

Related News

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

  • Mgnrega Rahul Gandhi

    MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd