Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం
కొత్తగా ఎన్నికైన మూడవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు .
- By Praveen Aluthuru Published Date - 01:03 PM, Sat - 9 December 23

Akbaruddin Owaisi: కొత్తగా ఎన్నికైన మూడవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు . రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేయగా, ఒవైసీ విశ్వాసపాత్రంగా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డి.శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా పాల్గొన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పీకర్గా నిర్ణయించింది. ఈనేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఎంపిక నామమాత్రమే కానుంది.సాధారణంగా సభలో సీనియర్ అయిన సభ్యుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు చేపడతారు.
Also Read: KCR : కేసీఆర్ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ