Seethakka : సుద్దపూస మాటలు మనుకోవాలంటూ బిఆర్ఎస్ కు మంత్రి సీతక్క హితవు
Seethakka : పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు
- Author : Sudheer
Date : 20-01-2025 - 7:18 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka ) బిఆర్ఎస్ (BRS) నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కోటీశ్వరులకు ప్రత్యేక ప్రయోజనాలు ఇచ్చి కూలీలను విస్మరించిన బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు.
Ram Charan : దిల్ రాజుకి రామ్ చరణ్ అభయం.. నిజమెంత..?
మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా సీతక్క కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను ‘డొల్ల’ అంటూ విమర్శించారు. దీనిపై సీతక్క స్పందిస్తూ.. ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కూలీ కుటుంబాలకు ఇచ్చిన ఆర్థిక సహాయం వాస్తవంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ స్కీమ్, భూమిలేని కూలీలకు కీలకమైన ఉపాధి మంజూరు చేస్తుందని ఆమె వివరించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేసింది. హరీష్ రావు వంటి నాయకులు ఈ పథకంపై అపోహలు సృష్టిస్తున్నారని సీతక్క ఆరోపించారు. ఈ పథకం ద్వారా భూమిలేని ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించబోతుందని , మొత్తం రాష్ట్రంలో 48 లక్షల కూలీ కుటుంబాలు ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. గ్రామసభల ద్వారా ఈ పథకాన్ని జారీ చేస్తామని ఆమె వెల్లడించారు. ప్రజలు ఈ పథకాన్ని సరైన దృష్టితో అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.