Telangana : అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి – మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అంగన్వాడీలు
- By Prasad Published Date - 12:16 AM, Sat - 23 September 23
తెలంగాణలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని ఆమె కోరారు. మహిళా,శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దని.. న్యాయ మైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదని.. సమాజంలో గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారేనని.. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని ఆమె కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తుందని.. వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలన్నారు. కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వనికి అంగన్ వాడీల తరుపున లేఖ రాస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి అప్పీల్ చేస్తామని.. ప్రభుత్వం ఉద్యోగుల మాదిరే పీఆర్సీని ఇస్తామన్నారు. అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేంద్ర పరిధిలోని అంశమన్నారు.
Related News
TS : త్వరలో టీజీఎస్ఆర్టీసీగా లోగోలో మార్పులు..ఆర్టీసీ వెల్లడీ
TSRTC to TGSRTC: త్వరలోనే టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఆర్టీసీ(RTC) అధికారులు ప్రకటించారు. అతి త్వరలోనే లోగోలో(logo) మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై బస్సులను టీజీ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు