Harish Rao : ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేస్తే..రూ. 3వేలు పారితోషికం..!!
తెలంగాణ మంత్రి హరీష్ రావు..వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు..మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
- By hashtagu Published Date - 10:12 PM, Tue - 7 June 22
తెలంగాణ మంత్రి హరీష్ రావు..వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు..మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. వీలుదొరికినప్పుడల్లా…ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ…నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వైద్య సిబ్బందికి మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో నార్మల్ డెలివరీల కోసం ప్రోత్సహిస్తే…ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం స్టాప్ నర్సులు వైద్య వర్గాలకు రూ. 3వేల పారితోషికం అందిస్తామని హరీశ్ రావు ప్రకటించారు.
పేదవారికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న హరీశ్ రావు…సీజెరియన్లను ప్రోత్సహించవద్దని హితవు పలికారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగాలని…నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తేడా తెలియజేయాలని మంత్రి చెప్పారు.
ఈ మధ్యకాలంలో సిజేరియన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో డెలవరీలకు వెళ్లే కేసీఆర్ కిట్ ను అందిస్తోంది సర్కార్. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిపోతోంది. సిజెరీయన్లను అరికట్టి…నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
Related News
TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలి�