Minister Harish Rao : దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది అని మంత్రి హరీష్ రావు అన్నారు.
- By News Desk Published Date - 09:45 PM, Sun - 2 July 23
ఖమ్మం జిల్లా (Khammam District) లో జరిగిన తెలంగాణ (Telangana) జనగర్జన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్గా మారింది, అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారు అంటూ హరీష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది అని హరీష్రావు అన్నారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా రాహుల్..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అని హరీష్ రావు విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. స్కీమ్లు, స్కాం లలోఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే అంటూ విమర్శించారు.
అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా రాహుల్ అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు రాహుల్ ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే పసలేని ఆరోపణలు.. ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అంటూ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ
Related News
Fifth Phase – Key Candidates : రేపే ఐదోవిడత పోల్స్.. హై ప్రొఫైల్ అభ్యర్థులు వీరే
లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ మే 20న జరగనుంది.